తిరుమల, జులై 28 (ప్రజా అమరావతి);
తిరుమలలో వేడుకగా పల్లవోత్సవం
తిరుమలలో బుధవారంనాడు పల్లవోత్సవం వేడుకగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టిటిడి పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.
అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మైసూర్ ప్యాలెస్ మహారాణి శ్రీమతి ప్రమోదాదేవి వడయార్, కర్ణాటక రెవెన్యూ&దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మంజునాథ్ ప్రసాద్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి రోహిణి సింధూరి, శ్రీవారి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment