విభజన చట్టం హక్కులు, కరోనా ప్యాకేజీపై పార్లమెంటులో ప్రస్తావిస్తాం


మంగళగిరి (ప్రజా అమరావతి);

విభజన చట్టం హక్కులు, కరోనా ప్యాకేజీపై పార్లమెంటులో ప్రస్తావిస్తాం

-  చంద్రబాబు నాయుడుగారు

శుక్రవారం నాడు మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ...  జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా విజృంభించడం, ప్రజలకు సరైన వైద్యం అందకపోవడం, కరోనా కోసం కేంద్రం కేటాయించిన నిధులను దారిమళ్ళించడం, మృతుల సంఖ్యను తక్కువగా చూపడం, కరోనా ప్యాకేజీ ఇవ్వకపోవడం వంటి అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చేతులెత్తేసి లక్షలాదిమంది కరోనా బారిన పడేలా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులను దారి మళ్ళించడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కక్ష సాధింపు చర్యలకు దుర్వినియోగం చేయడం, అక్రమ కేసులను పార్లమెంటులో లేవనెత్తాలన్నారు. విశాఖ ఉక్కు, రైతులు పండిరచిన పంటలకు మద్దతు ధర, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. 

టిడ్కో ఇళ్లను తెలుగుదేశం హయాంలో నిర్మిస్తే వాటిని డిపాజిట్‌దారులకు అందించకుండా పాడుబెడుతున్న వైనాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించారు. ప్రత్యేకహోదా, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ, విభజన చట్టంలోని హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబునాయుడు తెలిపారు. 

రెండేళ్ల నుంచి ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ వాటిని ఇవ్వకుండా దారి మళ్ళించి కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అంశంపై పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు.

వీరోచిత పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న వివాఖ ఉక్కును కాపాడుకునేందుకు కృషి చేయాలని తెదేపా ఎంపీలకు చంద్రబాబునాయుడు సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూములను కాజేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను పార్లమెంటులో ఎండగట్టాలన్నారు. సేవాభావంతో పనిచేస్తూ లక్షలాదిమంది ప్రజల పురోభివృద్ధికి తోడ్పడిన మాన్సాస్‌ ట్రస్టుపై జగన్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు దిగుతున్న వైనాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ కంపెనీలో రూ.300 కోట్ల బ్లాక్‌మనీ ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించిన అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలన్నారు. 

భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కస్టడీలో ఉన్న పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజుపై దాడికి పాల్పడ్డారన్నారు. ఏపీ సీఐడి అధికారులు వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ విషయాన్ని పార్లమెంటులో చర్చించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం బరితెగింపు చర్యలను, తెదేపా శ్రేణులపై అక్రమ కేసులను కేంద్ర హోంమంత్రిని తెదేపా పార్లమెంటు సభ్యులు కలిసి ఫిర్యాదు చేయాలన్నారు. 

ఈ సమావేశంలో తెలుగుదేశంపార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, టీడీ జనార్థన్‌  పాల్గొన్నారు.

` తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం

Comments