మైనార్టీల సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం
రెండు సంవత్సరాల కాలంలో వివిధ పథకాల ద్వారా రూపాయలు 3,430 కోట్ల లబ్ది
*సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిటకే అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*
*: ఎన్నికల హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుంది*
*: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష*
అనంతపురం, ఆగస్టు 07 (ప్రజా అమరావతి):
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటినుంచి సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిటకే అందిస్తున్నారని, ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకే అందించిన ఘనత ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష పేర్కొన్నారు. శనివారం అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ అతిథి గృహం నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజా సంక్షేమం కోసమే కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తూ నవరత్నాల పథకాల ద్వారా కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటికే అందిస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలకు పైగా గడిచాయని, అనేక ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు పని చేశారని, ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిన వారిని చూశామన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తూ 95 శాతం హామీలను అమలు చేశారని, దేశంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు. తమ ప్రభుత్వం నవరత్నాల పథకాల హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ప్రజలకు సందర్భానుసారంగా ఏవేవి అవసరమవుతాయో అలాంటి వాటిని కూడా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు పూర్తిగా న్యాయం చేస్తూ అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉన్నతమైన పదవులు ఇచ్చిన ఘనత వైయస్ జగన్ కే దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ క్యాబినెట్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులను కేటాయించడం జరిగిందని, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం జరిగిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరిని ఉప ముఖ్యమంత్రులను చేశారని, ఇది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. తమ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందన్నారు.
రాష్ట్రంలో 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 56 కార్పొరేషన్లకు 56 మంది చైర్మన్లను నియమించడం జరిగిందని, సుమారు 700 మంది డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. ఆయా కార్పొరేషన్లకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం పదవులను కేటాయించడం జరిగిందని, తమ ప్రభుత్వంమ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉన్నతమైన పదవులు కేటాయించడం జరిగిందని, ఇతర కులాలకు ఇదొక విప్లవం అయితే, మైనార్టీలకు ఇదొక స్వర్ణయుగం అన్నారు. గతంలో మైనారిటీ సామాజిక వర్గాన్ని ఎవరూ గుర్తించలేదని, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రమే మైనారిటీలను గుర్తించారన్నారు. ఆనాడు వైఎస్సార్ రిజర్వేషన్లు కల్పించారని, ఈ రోజు ఎంతో మంది మైనారిటీ విద్యార్థిని విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారని, అనేకమైన పదవులు, ఉద్యోగాలలో మైనార్టీలు ఉన్నారన్నారు. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే ఆ మహానేత కుమారుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేస్తూ మొన్న 80 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్ ల పదవులను నియమిస్తే అందులో 12 మంది మైనారిటీలకు పదవులు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 12 మేయర్ స్థానాలు ఉంటే అందులో ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వారు ఉన్నారని, పదుల సంఖ్యలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ లు ఉన్నారన్నారు. మైనారిటీ వర్గానికి ఉన్నతమైన పదవులు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట మైనారిటీలు అండగా ఉంటారన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను కూడా ఎవరి ప్రమేయం లేకుండా, మధ్యవర్తుల, దళారుల ప్రమేయం లేకుండా కులం, మతం, వర్గాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా ప్రజల ముంగిటికే నేరుగా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన రెడ్డి బటన్ నొక్కి నేరుగా అర్హత కలిగిన లబ్ధిదారుల ఖాతాల్లో వేల కోట్ల రూపాయలను జమ చేయడం జరుగుతోందన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా, రికమండేషన్ లేకుండా నేరుగా అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో భాగంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయాలని తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. కరోనా నియంత్రణలో కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో కరోనా మరణాల రేటులో కూడా మన రాష్ట్రంలో తక్కువ మరణాలు నమోదయ్యాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడపాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేయాలని ముందుకు వెళ్తున్నారన్నారు.* మైనారిటీల సంక్షేమానికి అభివృద్ధికి ఈ రెండు సంవత్సరాల కాలంలో వివిధ పథకాల ద్వారా రూపాయలు 3430 కోట్ల లబ్ధి చే కూర్చోమన్నారు.
ఈ సమావేశంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటి చైర్మన్ గోసూల్ ఆజం, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, రెండవ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, మార్కెట్ చైర్మన్ ఫయాజ్ భాష, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment