శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  టి.టి.డి చైర్మన్ శ్రీ YV సుబ్బారెడ్డి దంపతుల వారు  శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా గౌరవ ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గౌరవ శ్రీ YV సుబ్బారెడ్డి  దంపతుల వారు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము చేసుకొని పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము శ్రీ YV సుబ్బారెడ్డి దంపతుల వారికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు మరియు చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేసినారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మరియు చైర్మన్ గారు గౌరవ టి.టి.డి చైర్మన్ శ్రీ YV సుబ్బారెడ్డి దంపతుల వారికి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దర్శనం కల్పించారు.

Comments