శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి): విశాఖపట్నంకు చెందిన శ్రీ రత్నాకర్ రావు మరియు కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం రూ.1,01,116/-లు ను ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గ మరియు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు విరాలమును చెక్కు రూపములో అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గారు మరియు కార్యనిర్వహణాధికారి వార్లు శ్రీ అమ్మవారి చిత్రపటం మరియు ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment