శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప(వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ) ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని) శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రివర్యులు గారి కుటుంబమునకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ మరియు పాలకమండలి సభ్యులు శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు.
addComments
Post a Comment