• ఎపిఎస్ఎస్డిసి - సీడాక్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ ట్రైనింగ్
• కంప్యూటర్ సైన్స్, ఐటి, ఈసీఈ విద్యార్థులకు శిక్షణ
• శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఎపిఎస్ఎస్డిసి - సీడాక్ సర్టిఫికేషన్
అమరావతి (ప్రజా అమరావతి):
హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) సంస్థ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్ లైన్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్ఎస్డిసి) ఎండీ ఎన్. బంగారరాజు తెలిపారు. మంగళవారం తాడేపల్లిల్లోని సంస్థ కార్యాలయం నుంచి సీడాక్ అధికారులతో ఆన్ లైన్ వర్చువల్ ద్వారా మీటింగ్ నిర్వహించారు. బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటి, ఈసీఈ) ఇతర సమానమైన అర్హతలు ఉన్నవారికి సీడాక్ సంస్థ పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ (C-DAC) సంస్థ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని.. వారి సహకారంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న మూడు కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు బంగారరాజు తెలిపారు.
*శిక్షణ ఇచ్చే కోర్సులు:*
1) బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ (బ్లెండ్),
2) హార్డ్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎంబాడెడ్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (హ్యాండ్స్ ఆన్),
3) మల్టీలింగ్వల్ క్రాస్ ప్లాట్వ్ఫామ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ యూజింగ్ రియాక్ట్ నేటివ్ ఫ్రేమ్ వర్క్ అండ్ ఫైర్ బేర్ ( మెంటార్) కోర్సుల్లో ఆన్ లైన్ ట్రైనింగ్ ఇవ్వనుందని బంగారరాజు తెలిపారు.
ఒక్కో కోర్సు 100 గంటలపాటు ఉంటుందని.. ఇందులో 60 గంటలు థియరీ, 40 గంటలు ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి ఎపిఎస్ఎస్డిసి-సీడాక్ సంయుక్తంగా సర్టిఫికేట్ జారీ చేస్తాయని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ప్రారంభం అవుతుందని.. ఆసక్తి ఉన్నవారు ఎపిఎస్ఎస్డిసి వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని బంగారరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్ఎస్డిసి ఎండీ ఎన్ బంగారరాజుతోపాటు సీజీఎం టెక్నికల్ డాక్టర్ గుజ్జుల రవి, జీఎం (ఇంజనీరింగ్) బి. గోపినాథ్, సీడాక్ డైరెక్టర్ లక్ష్మిఈశ్వరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment