శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): ఈరోజు అనగా ది.23-08-2021 న ఖిల్లా రోడ్, ఇబ్రహీంపట్నం(మ), కొండపల్లి కి చెందిన శ్రీమతి సంగీత గారు(w/o రవీంద్ర బాబు) శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం శ్రీ సంగీత మరియు భానూజి రావు గారి పేర్ల మీద రూ.1,00,116/-లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారిని కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment