సిఎస్ను కలిసిన బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్
అమరావతి (ప్రజా అమరావతి): బ్రిటన్ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ పధకాలు ప్రాజెకుల వివరాలను సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ హైకమిషనర్కు వివరించారు. అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అనువైన రంగాలు, ప్రాంతాల వివరాలను కూడా తెలియజేస్తూ ఆయన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చేలా తగిన కృషి చేయాలని బ్రిటిష్ హైకమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ను కోరారు. హైకమిషనర్ మాట్లాడుతూ ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్తు వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్కు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్టు సిఎస్కు వివరించారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ను దుశ్శాలువా, జ్నాపికతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, యుకె డెలిగేషన్ ప్రతినిధులు బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment