*ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
.*
అమరావతి (ప్రజా అమరావతి);
*వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలపై సీఎం సమీక్ష*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..:*
వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి: అధికారులకు సీఎం వైయస్.జగన్ ఆదేశం
గ్రామాలకు మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది:
ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్తోపాటు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు:
డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రెన్స్ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్:
గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్ కనెక్షన్:
నిరంతర ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు:
సీఎం వైయస్.జగన్
ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు: సీఎం వైయస్.జగన్
అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుంది:
మొదటి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం:
ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలన్న సీఎం
ఆలోగా స్థలాలు గుర్తించి హేండ్ ఓవర్ చేయాలని సీఎం ఆదేశం
అదే సమయంలో డిసెంబర్ కల్లా డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకున్నామన్న అధికారులు
*డిజిటల్ లైబ్రరీలు– హై క్వాలిటీ ఇంటర్నెట్*
డిజిటల్ లైబ్రరీ బిల్డింగులో కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్టాపులు, యూపీఎస్, డెస్క్టాప్ బార్కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, సాఫ్ట్వేర్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్, అన్లిమిలెడ్ బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్
స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని సీఎం ఆదేశం
మౌలిక సదుపాయాల్లో భాగంగా 3 డెస్క్టాప్ టేబుల్స్, సిస్టం చెయిర్స్, విజిటర్ చెయిర్స్, ట్యూబులైట్స్, ఫ్యాన్లు, ఐరన్ రేక్స్, వార్తాపత్రికలు, మేగజైన్స్ డిజిటల్ లైబ్రరీల్లో ఏర్పాటు
తొలివిడతలో భాగంగా 4530 డిజిటల్ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్ పరికరాలకోసం దాదాపుగా రూ.140 కోట్లకుపైగా ఖర్చుచేయనున్న ప్రభుత్వం
ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం మధుసూధన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ ఎం నంద కిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment