- శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు
- ఘనస్వాగతం పలికిన కల్వపూడి అగ్రహారం గ్రామస్థులు
గుడివాడ, ఆగస్టు 21 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామంలో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కొడాలి నానికి గ్రామస్థులు పెద్దఎత్తున పూలమాలలు వేసి గ్రామంలోకి ఆహ్వానించారు. మంత్రి కొడాలి నానికి గ్రామస్థులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పెద్దఎత్తున పూలవర్షం కురిపించారు. ఆలయ అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో మంత్రి కొడాలి నానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి కొడాలి నానికి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. గ్రామ ప్రముఖుడు చెర్వు ప్రదీప్ శ్రీరామసాయి మంత్రి కొడాలి నానికి పూలమాల వేసి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. శ్రీవీరాంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి కొడాలి నానికి బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని గ్రామ ప్రముఖులు, పెద్దలతో కొద్ది సేపు మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను వారంతా మంత్రి కొడాలి నానికి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, పంచాయతీరాజ్ డీఈ హరనాథ్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ పోటూరి వెంకటేశ్వరమ్మ, మాజీ సర్పంచులు ఏలేటి అగస్టీన్, వెలిసేటి సరళ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, పర్నాస సర్పంచ్ గొర్ల రాజేష్, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ, వైసీపీ నేతలు పోటూరి శ్రీమన్నారాయణ, అద్దేపల్లి పురుషోత్తం, కఠారి రాంబాబు, బచ్చు మణికంఠ, కోట రాకేష్, కోట మహేష్, తాళ్ళూరి ప్రశాంత్, అద్దేపల్లి హరిహరప్రసాద్, జీ హర్ష తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment