శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము,
ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి):
దేవస్థానము నందు ది.30.08.2021, సోమవారము రోజున శ్రీ కృష్ణాష్టమి పర్వదినమును పురస్కరించుకొని శ్రీ కృష్ణ భగవానునికి పూజ, గో-పూజా కార్యక్రమాలు నిర్వహించుట జరిగినది.
ఆలయ స్థానాచార్యులు వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు యందు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించిన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి. భ్రమరాంబ గారు.
కార్యక్రమ వివరములు :
శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణ భగవానులకు షోడశోపచార పూజ, నివేదన, హారతి, నీరాజన మంత్ర పుష్పములు ఇత్యాది పూజా కార్యక్రమాలు, గో-పూజ శాస్త్రోక్తంగా నిర్వహించడమైనది.
addComments
Post a Comment