వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేలులో నూతన ప్లాంట్‌ ఏర్పాటుచేయనున్న సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌.

 

అమరావతి (ప్రజా అమరావతి);

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిసిన సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ సజ్జన్‌ భజంకా, ఈడీ కేశవ్‌ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షా.

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేలులో నూతన ప్లాంట్‌ ఏర్పాటుచేయనున్న సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌.*


ప్లైఉడ్, బ్లాక్‌ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డ్, పార్టికల్‌ బోర్డ్‌ల తయారీలో భారతదేశంలోనే అత్యంత పెద్ద తయారీ పరిశ్రమగా ప్రత్యేక గుర్తింపు పొందిన సెంచరీ ఇండియా.

 పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, అసోం, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఇప్పటికే యూనిట్‌లు ఏర్పాటుచేసిన కంపెనీ.

ఏపీలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ప్రాజెక్ట్‌ నిర్మాణం, 3,000 మందికి ప్రత్యక్షంగా, దాదాపు 6,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.

వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి, డిసెంబర్‌ 2022 కల్లా మొదటి దశ ఆపరేషన్స్‌ మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్న కంపెనీ, 2024 డిసెంబర్‌ కల్లా మూడు దశల్లో పూర్తికానున్న నిర్మాణం.

ఏడాదికి 4,00,000 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో మొదటి విడత ప్రారంభించి మూడు దశలు పూర్తయ్యే సరికి 10,00,000 మెట్రిక్‌ టన్నుల పూర్తిస్ధాయి సామర్ధ్యం.

రైతులతో యూకలిప్టస్‌ తోటల పెంపును ప్రోత్సహించి, కొనుగోళ్ళుపై గిట్టుబాటు ధర కల్పించడం, ఆర్ధికంగా రైతులకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్న కంపెనీ ప్రతినిధులు..

కంపెనీ ప్రణాళికలను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌కు వివరించి చర్చించిన ప్రతినిధులు

ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.కరికాల్‌ వలవన్‌.

Comments