363 గ్రామాల్లో మ్యాప్‌ల రూపకల్పన పూర్తయ్యిందని తెలిపారు.


అమరావతి (ప్రజా అమరావతి);


- సచివాలయంలో జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పై మంత్రుల కమిటీ సమావేశం

- సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ అజేయకల్లాం

- హాజరైన అధికారులు సిసిఎల్‌ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఉషారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఐటి) జి.జయలక్ష్మి,  పిఆర్‌&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్థ్‌జైన్, ఇన్‌చార్జి డిఎంజి చంద్రశేఖర్‌రావు తదితరులు


సమీక్ష సందర్భంగా సర్వే కార్యక్రమం పై  అధికారులు మంత్రులకు వివరించారు. 


- సెప్టెంబర్ 13వ తేదీ నాటికి 815 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయ్యిందని అధికారులు  వివరించారు.

- 363 గ్రామాల్లో మ్యాప్‌ల రూపకల్పన పూర్తయ్యిందని తెలిపారు.


- 279 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యిందని, మరో 84 గ్రామాల్లో పనులు పురోగతిలో ఉన్నాయన్న అధికారులు.

- 77,33,825 హౌస్‌హోల్డ్ రికార్డులకు గానూ 74,99.508 ఇళ్ళ రికార్డులను అప్‌డేట్ పూర్తి చేశామని వివరించిన అధికారులు.

- ఏడాదిలో డ్రోన్‌ సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న అధికారులు.


- సమీక్ష సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ...

- జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద రాష్ట్రంలో సర్వే పనులు వేగవంతం చేయాలి.

- పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలి.

- సర్వే ప్రక్రియ సందర్భంగా అవసరమైన శిక్షణను ఎపి ఎస్‌ఐఆర్‌డి ద్వారా నిర్వహించాలని సూచించిన మంత్రులు

- కొత్తగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్న మంత్రులు

Comments