తిరుమలలో శాస్త్రోక్తంగా ఉట్లోత్సవం.
తిరుమల (ప్రజా అమరావతి): శ్రీ కృష్ణజనామాష్టమి వేడుకలో భాగంగా తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవ ఆస్థానం మంగళవారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ - 19 వ్యాప్తి సందర్భంగా ఈ వేడుకలు ఆలయంలో ఏకాంతంగా జరుగుతాయి.
శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తున్న మరునాడు ఉట్లోత్సవాన్ని (శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులోభాగంగా శ్రీ మలయప్పస్వామివారిని బంగారు తిరుచ్చిపై ప్రసాదాలు తయారు చేసే పోటులోనికి, శ్రీ కృష్ణస్వామివారిని మరో తిరుచ్చిపై పోటు మండపంలోని కి వేంచేపు చేసి నివేదన, హారతి ఇచ్చారు.
తరువాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివార్లను వేంచేపు చేసి ఆస్థానం, నివేదన, హారతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీ చిన్న చిన్న జీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ IO శ్రీ రమేష్ బాబు, వీజీవో శ్రీ బాలి రెడ్డి ఇతర అధికారుల వినియోగం.
addComments
Post a Comment