దసరా క్యూ లైన్ పనులు ప్రారంభం:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి): దేవస్థానం నందు నిర్వహించు దసరా -2021 మహోత్సవములు సంబంధించిన క్యూ-లైన్ యొక్క పనులు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ ప్రారంభించడం జరిగినది. శ్రీ వినాయక స్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభమగు క్యూ- లైన్ యొక్క పనులను ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, ధర్మకర్తల మండలి ఛైర్మన్ , కార్యనిర్వహణాధికారి గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ డి.వి.భాస్కర్
మరియు అధికారులు పూజలు నిర్వహించి,కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడము జరిగినది.
addComments
Post a Comment