తాడేపల్లి (ప్రజా అమరావతి)!
నవ్వే ప్రతి చిరునవ్వు లో వైఎస్సార్ ఉంటారు, భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు: దొంతిరెడ్డి వేమారెడ్డి.
తాడేపల్లి టౌన్, రూరల్ గ్రామాల్లో వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలు.
వైసీపీ రాష్ట్ర స్థానిక సంస్థల రాష్ట్ర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు.
ఉండవల్లిలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన వేమారెడ్డి వైయస్సార్ సిపి నాయకులు.
వాడ వాడల దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 12 వర్ధంతి కార్యక్రమాలు.
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని పలు ప్రాంతాల్లో పేదలకు పళ్ళు, దుప్పట్లు పంపిణీ.
మండలంలో పలు ఆశ్రమాల్లో వృద్దులకు,పిల్లలకు,పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణా రెడ్డి, మేకా అంజిరెడ్డి, కళ్యాణ్,ఉండవల్లి మాజీ ఎంపిటిసి సంజీవరెడ్డి, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు,ఎంపిటిసిలు, జెడ్పిటిసీలు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment