కొవ్వూరు (ప్రజా అమరావతి);
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ పేర్కొన్నారు.
కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా పరిపాలనాధికారి జి. ఎస్. ఎస్.జవహర్ బాజీ, మాట్లాడు తూ మొత్తం 15 మంది నుండి స్పందన ఫిర్యాదు లు
వచ్చాయాన్నారు. వీటిలో స్థల వివాదాలు పరిష్కారం, ఇంటి స్థలం కోసం, రెవెన్యూ శాఖ కి సంబంధించిన స్థలాల సమగ్ర సర్వే, సదరన్ ధ్రువీకరణ పత్రం, తదితర అంశాలపై ఫిర్యాదులు వొచ్చాయని తెలిపారు. సదరు ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు.
స్పందన కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment