శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి): గుణదల, విజయవాడ కు చెందినశ్రీ దేవినేని రాజశేఖర్ గారి పేరు మీద ప్రతిరోజు అన్నదానం జరుపుటకు గాను శ్రీమతి దేవినేని లక్ష్మీ గారు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం రూ.2,01,116/-లు ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు చెక్కు రూపంలో విరాలముగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ పాలకమండలి సభ్యురాలు శ్రీమతి ఎన్. సుజాత గారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
addComments
Post a Comment