జనాగ్రహ దీక్షలో కాకాణి

 *జనాగ్రహ దీక్షలో కాకాణి*




*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .




 చంద్రబాబు దుర్బుద్ధితో, ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.


 చంద్రబాబు పట్టాభి లాంటి నీచుడి చేత, ముఖ్యమంత్రి గారిపై దుర్భాషలాడించడం చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు.


 చంద్రబాబు దొంగ దీక్షలు చేయడం, ప్రజలను పక్కదారి పట్టించడానికి తప్ప, మరొకటి కాదు.


 ఆంధ్ర రాష్ట్రంలో అలజడి వాతావరణం సృష్టించడానికి చంద్రబాబు కారణం కాదా!.


 చంద్రబాబు తన చెంచాలతో దుర్భాషలాడించి, ప్రజలు తిరగబడితే, ప్రజాస్వామ్యం పై దాడి అంటూ నీతి మాటలు వల్లిస్తున్నాడు.


 ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, బలవంతంగా కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యాలయం దేవాలయం ఎలా అవుతుంది.


 చంద్రబాబుకు భాషకు అర్థం తెలియదు, లోకేష్ కు భాష మాట్లాడటం చేతకాదు.


 చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేక గొడవలు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రచారం చేస్తున్నాడు.


 జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి, అరాచకాలు సృష్టించి, రాష్ట్రాన్ని అశాంతి పాలుచేసి, ఆర్టికల్ 356ను ఉపయోగించాలని చంద్రబాబు నోటి వెంట రావడం కుట్రలో భాగమే!.


 కుట్రదారుడు, వెన్నుపోటు దారుడైన చంద్రబాబు  విద్వేషాలు రెచ్చగొట్టి, రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చడానికి యత్నిస్తున్నాడు.


 వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యాఖ్యలను, చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షలు ఖండిస్తూ, *"జనాగ్రహ దీక్ష"* లు చేపట్టాం.


 ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం జగనన్న వెంట ఉన్నన్నాళ్లు, చంద్రబాబు లాంటి కుట్రదారులు ఏమీ చేయలేరు.


 ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం తెలుగుదేశం పార్టీ బూతుపురాణం పై విమర్శలు గుప్పిస్తూ, జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నారు.


 సమాజం కోసం, ప్రజల కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన *"పోలీసు అమరవీరులకు బాష్పాంజలి"* ఘటిస్తున్నాం.


 పోలీస్ అమరవీరుల దినోత్సవం నాడు, రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారుల నుండి కింది స్థాయి పోలీసుల వరకు చంద్రబాబు బెదిరిస్తూ, వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే, చంద్రబాబుకు మతిభ్రమించినట్లుంది.


 చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, ఆంధ్ర రాష్ట్ర యవన్మంది ప్రజలు జగన్మోహాన్ రెడ్డి గారి వెన్నంటి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు.


చంద్రబాబుకు రాజకీయ బహిష్కరణ విధించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు త్వరలోనే, రాష్ట్రం నుండి కూడా బహిష్కరించడం ఖాయం.

Comments