శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి): మహామండపము 6 వ ఫ్లోర్ నందు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ , పాలకమండలి సభ్యులు శ్రీమతి కత్తిక రాజ్యలక్ష్మి , శ్రీమతి నేలపట్ల అంబికా , శ్రీమతి బుసిరెడ్డి సుబ్బాయమ్మ , శ్రీమతి కటకం శ్రీదేవి
, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF సిబ్బంది పర్యవేక్షించారు.
- మొదటి రోజు(25-10-2021) హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 2,87,83,153/- లు.
హుండీల ద్వారా వచ్చిన బంగారం: 546 గ్రాములు,
హుండీల ద్వారా వచ్చిన వెండి: 9 కేజీల 553 గ్రాములు
- రెండవ రోజు(26-10-2021) హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 3,19,39,430/- లు.
హుండీల ద్వారా వచ్చిన బంగారం: 474 గ్రాములు,
హుండీల ద్వారా వచ్చిన వెండి: 8 కేజీల 850 గ్రాములు
- ఈ రోజు(27-10-2021) హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 1,43,62,253/- లు.
హుండీల ద్వారా వచ్చిన బంగారం: 328 గ్రాములు,
హుండీల ద్వారా వచ్చిన వెండి: 8 కేజీల 174 గ్రాములు
- మూడు రోజుల హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 7,50,84,836/- లు.
హుండీల ద్వారా వచ్చిన బంగారం: 1 కేజీ 448 గ్రాములు,
హుండీల ద్వారా వచ్చిన వెండి: 26 కేజీల 577 గ్రాములు
శ్రీ అమ్మవారి సేవలో...
ఆలయ పాలకమండలి చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి.
addComments
Post a Comment