మీరు చెప్పారంటే చేస్తారంతే


అమరావతి (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*

*వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు*

*వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం*


*క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రైతులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి*


సీఎం సార్‌... మీరు చెప్పారంటే చేస్తారంతే


అని ఈ రోజు రాష్ట్రమంతా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. దీపావళి కంటే ముందే మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర రైతాంగానికి వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ క్రింద నిధులు ఇవ్వడం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ఇవ్వాల్సిన సబ్సిడీని ఇవ్వడం ద్వారా రైతులపై మీ ప్రేమను మరోసారి గుర్తుచేశారు. ఈ రోజు దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్న పరిస్ధితి ఉంది, అన్ని రాష్ట్రాలు మన వైపు చూడటానికి గల కారణం, వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి ఏ విధానాలు అవలంభిస్తున్నారు, అమలుచేస్తున్నారు అనేది మీ ఆలోచనలు, మీ సంకల్పమే కారణం. రైతు భరోసా కేంద్రాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నీతిఆయోగ్‌ వారు కూడా ఇక్కడి అధికారులను పిలుచుకుని అన్నీ తెలుసుకుని అభినందించారు. వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఇక్కడ పర్యటించి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల మోడల్‌ను తాము కూడా చేస్తామంటున్నారు. కేవలం రైతులకు ఇన్‌పుట్స్‌ ఇచ్చే వరకే కాకుండా దానిని ఒక విజ్ఞాన కేంద్రంగా, అన్ని సేవలు అందించేలా విత్తనం నుంచి విక్రయం వరకూ రైతులకు ఉపయోగపడే ఒక కేంద్ర కార్యాలయంగా మార్చడం గొప్ప విషయం. సోషల్‌ ఆడిట్‌ ద్వారా ప్రతీ ఒక్కటి ఆ గ్రామంలో ఏం జరుగుతుందో రైతులకు తెలియజేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. గతంలో అర్హులను కాదని అనర్హులకు ఇచ్చేవారు, కానీ ఇప్పుడలా లేదు. రూ. 2,190 కోట్ల సహాయాన్ని రైతులకు అందించే కార్యక్రమం మీరు చేపట్టినందుకు రైతాంగం తరపున మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్‌. 


*ఎం.విశ్వేశ్వర రావు, గిరిజన రైతు, తడిగిరి గ్రామం, హుకుంపేట మండలం,  విశాఖపట్టణం జిల్లా*


సార్‌ నేను గిరిజన రైతును, మీరు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిన వెంటనే మా అకౌంట్లలో రూ. 13,500 వైఎస్సార్‌ రైతు భరోసా మూడు దఫాలుగా అందింది, చాలా అనందంగా ఉన్నాం సార్, గతంలో స్వర్గీయ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హయాంలో కొంతమందికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చారు, ఆ తర్వాత మీ ప్రభుత్వంలో ఇచ్చారు. గతంలో మేం పోడు వ్యవసాయం చేసేవాళ్ళం, అప్పుడు గత ప్రభుత్వాలు పంటలు వేయకూడదని అడ్డుకునేవారు, కానీ ఇప్పుడు మీరు పట్టాలు ఇచ్చిన తర్వాత సంతోషంగా పంటలు సాగుచేసుకుంటున్నాం, మేం కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నాం, మా గిరిజనులకు మీరు అండగా ఉన్నారు, మా గిరిజన రైతులంతా మీకు రుణపడి ఉంటాం సార్, రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి, అలాగే పురుగుమందులు కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారు. అంతేకాదు అగ్రి అడ్వైజరీ బోర్డు సమావేశాలు ప్రతీ నెల మొదటి శుక్రవారం ఏర్పాటుచేసి మా ప్రాంతంలో ఏ పంటలు పండిస్తున్నామో, ఏ పంటలు అనుకూలమో చెప్పి సాగు చేయిస్తున్నారు. ఆర్‌బీకే సిబ్బంది కూడా నేరుగా పొలానికే వచ్చి అన్ని నేర్పుతున్నారు, పంట నష్టపోయిన వెంటనే ఇన్సూరెన్స్‌ అందుతుంది, చిన్న, సన్నకారు రైతులను మీరు ప్రోత్సహిస్తున్నారు. మా పాపకు అమ్మ ఒడి వచ్చింది, మా అమ్మకు ఫించన్‌ కూడా వస్తుంది. మీరు ఎల్లవేళలా ముఖ్యమంత్రిగా ఉండాలని మా గిరిజనులంతా కోరుకుంటున్నారు, వారంతా మీవెంటే ఉంటారు సార్, ధన్యవాదాలు


*కొండే లాజరస్, పెదపాడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా*


సార్‌ మీరు పాదయాత్రలో ఇచ్చిన వాగ్ధానం రైతు భరోసా, మా హృదయాలలో గట్టి నమ్మకం ఏర్పడింది. గతంలో జులై నెలలో ఆకుమడులు పోసుకునేవారిమి, డబ్బులేక ఆగష్టు నెలాఖరున ఆకుమడులు పోయడం వల్ల తీవ్రమైన నష్టం వచ్చింది. పంటలు పండించలేక, పిల్లలను చదివించలేకపోయాం. మాకు రైతు భరోసా వల్ల సకాలంలో పంటలు పండించుకుని అధిక లాభాలతో ఉన్నాం, ఈ రోజున మా కుటుంబాలు బావున్నాయి అంటే మీరే కారణం, అందరికీ మంచి చదువులు అందుతున్నాయి. మా పిల్లలను, మా తమ్ముడి పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు. మీరు రైతాంగానికి వెన్నెముకలా ఉన్నారు. అగ్రికల్చర్‌ అధికారులు కూడా మా దగ్గరకు వచ్చి పంటల గురించి వివరాలు చెబుతున్నారు. గతంలో చిన్న,సన్నకారు రైతులు బాగా ఇబ్బంది పడేవారు. మన ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆక్వా, మొక్కజొన్న, పామాయిల్‌ రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. కరెంట్‌ బిల్లులు కట్టలేని సమయంలో నాన్నగారు, మీరు చేసిన సాయం మరువలేం. ఆర్‌బీకేల ద్వారా మంచి సూచనలు, సలహాలు అందుతున్నాయి. గతంలో ఎరువుల కోసం తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అన్నీ కూడా మా గ్రామంలోనే అందుతున్నాయి. మా అమ్మకు క్యాన్సర్‌ వస్తే ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాం. నేను నాన్నగారి పాదయాత్రలో పాల్గొన్నాను, మీ పాదయాత్రలో కూడా పాల్గొన్నాను. వివిధ పథకాల ద్వారా మా కుటుంబం లబ్దిపొందింది. మీరే మా ఇంటి పెద్ద దిక్కులా మా పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నారు. మా క్షేమం కోసం ఇంత చేస్తున్న మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను సార్, ధ్యాంక్యూ


*పులిపాటి పద్మ, పోట్లూరు గ్రామం, గుడ్లూరు మండలం, ప్రకాశం జిల్లా*


అన్నా నేను ఎస్‌సీ కులానికి చెందిన పేద కౌలు రైతును, గత 10 ఏళ్ళుగా కౌలు రైతుగా జీవనం సాగిస్తున్నాను. నేను వరి, పత్తి, మినుము సాగు చేస్తున్నాను. మీరు గతంలో ఎన్నడూ చేయనివిధంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బును నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేయడానికి వాడుతున్నాను. మా సొంత అన్నదమ్ములు కూడా చేయని విధంగా మీరు సాయం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా క్రింద డబ్బు అందింది, సున్నా వడ్డీ అందింది. ప్రతీ మహిళ నోటా ఇదే మాట వింటున్నాను. ఆర్‌బీకేల ద్వారా అన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నేను ఇతర రైతులను కూడా ప్రోత్సహిస్తున్నాను. నేను సాధారణ రైతుల మాదిరి కౌలు రైతునైనా ఇ–క్రాప్‌ నమోదు చేయించుకుని పంట బీమా పొందాను. గతంలో దళారులకు పంట అమ్మి నష్టపోయాను, కానీ ఈ సారి మంచి రేట్‌తో అమ్ముకున్నాను. మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది మీ గురించి, మీ అమ్మ గారి గురించి నానా రకాలుగా దూషిస్తున్నారు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలని అంటారు కదా అలాగే. అన్నా మీకు మేమున్నాం, నా బిడ్డల తరానికి కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నా


*శ్రీదేవమ్మ, లక్ష్మిదేవిపురం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా*


జగనన్నా రైతు భరోసా ద్వారా మీరు రైతుల కళ్ళలో ఆనందం నింపారు. నేను రైతు భరోసాతో పాటు ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందుతున్నాయి. గతంలో కర్నూలు వెళ్ళి ఎక్కువ రేట్‌ పెట్టి కొనాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు గ్రామాలలోనే అన్నీ అందుతున్నాయి. ఇ–క్రాప్‌ బుకింగ్‌ ద్వారా నష్టపరిహారం అందింది. నేను సాధారణ పొదుపు మహిళను, మీరు అక్కచెల్లెమ్మలకు మాఫీ చేస్తానని హమీ ఇచ్చినట్లుగా మా బకాయిలు మాఫీ చేశారు. మా పంటలు కూడా ఇ–క్రాప్‌ చేయడం వల్ల అన్నీ అందుతున్నాయి. నా కూతురు ఎం ఫార్మసీ చేస్తుంది, ఫీజులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. నాకు ఆసరా డబ్బు అందింది, లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం తీసుకున్నాను. మీ పథకాలు అన్నీ అందుతున్నాయి, ఇంత చేసిన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి. మీరే మా ముఖ్యమంత్రిగా ఎల్లవేళళా కొనసాగాలని ఆశిస్తున్నాను సార్‌.

Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image