శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ దంపతుల వారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ దంపతుల వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీఅమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.