వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం,
తాడేపల్లి (ప్రజా అమరావతి)!
*-యాదవులు మరింత చైతన్యవంతంగా ఎదగాలి.*
*-యాదవులను అన్ని విధాలా శ్రీ వైయస్ జగన్ ప్రోత్సహిస్తున్నారు.*
*-రానున్న ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యాదవులంతా మధ్దతు పలికి తమ సత్తా చాటాలి.*
*-యాదవుల ఆత్మీయ సమావేశంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి.*
*త్వరలో యాదవ గర్జన నిర్వహించి యాదవుల అభివృధ్దికి తోడ్పడుతున్న శ్రీ వైయస్ జగన్ కు అండగా నిలబడతాం-రాష్ర్ట జలవనరుల శాఖమంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్*
రానున్న ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించేందుకు యాదవులు ప్రధాన భూమిక పోషించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యాదవుల ఆత్మీయ సమావేశం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. సమావేశానికి యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నాన్యంపల్లి హరీష్ యాదవ్ అధ్యక్షత వహించారు.
*సమావేశంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ* అగ్రవర్ణాలకు ధీటుగా రాజకీయ చైతన్యం ఉన్నవాళ్లు యాదవులని అన్నారు. వెనకబడిన కులాల్లోనే యాదవులు ముందున్నారని వారు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాజకీయంగా, ఆర్ధికంగా ముందుకు రావాలని కోరారు. రెండున్నరేళ్లలో జరగనున్న ఎన్నికలకు ఇప్పటినుంచే సిధ్దం కావాలని కోరారు. రాష్ర్టంలోని 90 శాతం కుటుంబాలకు శ్రీ వైయస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఆసరా, ఫీజురీయంబర్స్ మెంట్ తదితర పథకాల ద్వారా లబ్ది కలుగుతోందని అన్నారు. 151 మంది ఎంఎల్ఏలు, 28 మంది ఎంపీలు, స్దానిక సంస్ధలలో ఘనవిజయం మన పక్షాన ఉన్నాయి. అయినప్పటికి కూడా ప్రత్యర్ధి పార్టీలు రాష్ర్టంలో ఏదో జరుగుతోంది.... పింఛన్ లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు... అప్పులు... అంటూ ప్రజలలో గందరగోళం, అయోమయం సృష్టించేలా చేస్తున్నాయి. ప్రభుత్వం ఏమీ చేయడం లేదు... ఇది ఫెయిల్ అయిన ప్రభుత్వం అంటూ తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు... మోసపు తెలివితేటలు ఏ విధంగా ఉంటాయంటే చంద్రబాబునుంచి కిందస్ధాయి వరకు ఒకే విధమైన దుష్ప్రచారాన్ని మనపై మనకే అనుమానాలు కలిగించేవిధంగా దుర్మార్గంగా చేస్తారు. ఈరోజు ఒక పత్రికలో ప్రభుత్వం గురించి చెడుగా రాస్తారు. దానిపై ధర్నాలు, ఆందోళనలు చేస్తారు. అదే అంశంపై ఎవరో కోర్టులో వేస్తే దానిపై అక్కడ మొట్టికాయలు పడ్తాయి. దానిపై వారి అనుకూల మీడియాలో డిబేట్లు.... ఇదంతా చూసిన తర్వాత మన కార్యకర్తల్లోనే ఏదో మన వాళ్లు సరిగా వ్యవహరించడం లేదేమో అన్నంతగా ఆలోచనలు కలుగుతుంటాయి. ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా చేస్తున్నదుష్ప్రచారం నిజం కాదు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా దాదాపు లక్ష కోట్ల రూపాయలు దిగువ, మధ్యతరగతి, పేద కుటుంబాలకు మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాలలో వేశారు. ఇలా పేద వర్గాలను ఆదుకోవడం ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. టిడిపి హయాంలో కూడా పథకాలు జన్మభూమి కమిటీల దోపిడీ తర్వాత ప్రజలకు చేరేవి. ఈ వాస్తవాలను బిసి కులాలన్నీ కూడా ప్రజలలోకి తీసుకువెళ్లాలి. టిడిపి, ఇతర పక్షాలు చేస్తున్న దుర్మార్గ, దుష్ప్రచారాన్ని ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
*రాష్ర్ట జలవనరుల శాఖమంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ* శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రెడ్డివర్గీయులు బలంగా ఉండే నెల్లూరులో తనను మంత్రిగా చేసి కీలకమైన జలవనరుల శాఖను అప్పగించడమే యాదవులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారనేందుకు నిదర్శనమన్నారు. అదే విధంగా ఎంఎల్ఏలుగా, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లుగా, స్దానిక సంస్ధలలో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ లు, ఎంఎల్సిలుగా వివిధ కార్పొరేషన్ డైరక్టర్లుగా నియామకాలు చేశారన్నారు. ఇంతగా యాదవులను ప్రోత్సహిస్తున్నoదున మనందరం త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ తరపున యాదవగర్జన నిర్వహించి శ్రీ వైయస్ జగన్ కు మరింత అండగా మధ్దతుగా నిలబడదామని పిలుపునిచ్చారు. అదే విధంగా శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని మొదటగా తెరిచేది సన్నిధి గొల్లలన్నారు. దానికి సంబంధించి సంప్రదాయాన్ని గౌరవించేలా ఈ ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీచేశారన్నారు. బిసిలలో పెద్దన్న పాత్రలో ఈరోజు యాదవులు ఉన్నారన్నారు. రాష్ర్టంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో యాదవులు మరింత బలంగా ఎదగాలని కోరారు. నాయకత్వం బలంగా ఎదగగలిగితే మరిన్ని అసెంబ్లీ స్ధానాలను యాదవులకు అడగవచ్చన్నారు. ప్రతి జిల్లాలో యాదవభవన్ నిర్మాణం జరిగేలా యాదవులంతా ఐక్యంగా కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి గారు, ఎమ్మెల్యేలు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు, శ్రీ బుర్రా మధుసూదన్ గారు, ఎమ్మెల్సీలు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు, శ్రీ రాచగొల్ల రమేష్ యాదవ్ గారు, విశాఖ మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి గారు, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్ శ్రీ అంకంరెడ్డి నారాయణ మూర్తి గారు, రాష్ట్ర గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ ఛైర్మన్ శ్రీ నర్తు రామారావు గారు, విశాఖ నగర పార్టీ అధ్యక్షులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, బీసీ విభాగ రాయలసీమ రీజియన్ సమన్వయకర్త శ్రీ తొండమల్ల పుల్లయ్య గారు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment