నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి : అధికారులకు సీఎం ఆదేశం




*క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


అమరావతి (ప్రజా అమరావతి);

*–క్లాప్‌ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:* 


– నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి : అధికారులకు సీఎం ఆదేశం


– రాష్ట్రంలో పూర్తి స్ధాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్న సీఎం

– వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలన్న సీఎం

– కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం

– గ్రేడ్‌ 2, గ్రేడ్‌ 3 నగరపంచాయతీలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ కూడా ఆయా నగరాలకు, పట్టణాలకు, నగర పంచాయతీలకు, పంచాయతీలకు చేరవేయాలన్న సీఎం  

– గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్‌ వేస్ట్‌ ప్రాససింగ్‌ సెంటర్లు(ఎస్‌డబ్ల్యూపీసీ), అర్భన్‌లో 72 చోట్ల ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ (ఐఎస్‌డబ్ల్యుఎం) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు

– జూన్‌ 2022 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామన్న అధికారులు

–ఇప్పటివరకు చెత్త సేకరణకు 30 లక్షల డస్ట్‌బిన్స్‌ సరఫరా చేశామన్న అధికారులు

– ప్రతి ఇంటికి డస్ట్‌బిన్స్‌ అందించాలన్న సీఎం

–ఎలక్ట్రిక్‌ వాహనాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం 

– సంబంధిత కంపెనీలతో మాట్లాడుకుని ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

–నగరాలు,  పట్టణాల్లో గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి సమీపంలోని ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి : అధికారులకు సీఎం ఆదేశం 

– ఎప్పటికప్పుడు గార్బేజ్‌ తొలగించడమే కాకుండా ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం

–గుంటూరులో వ్యర్థాలనుంచి విద్యుత్‌ ఉత్పత్తి కర్మాగారం (వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ – డబ్ల్యుటీఈ) సిద్ధమైందని తెలిపిన అధికారులు. 

–ప్రతిపాదిత ప్రాంతాల్లోకూడా ఈ ప్లాంట్ల ఏర్పాటు పై దృష్టి పెట్టాలన్న సీఎం. 

–రాష్ట్రంలో 2 వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు

– పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్వహణపైనా అధికారులు దృష్టి పెట్టాలన్న సీఎం 

–పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించడంపైనే కాదు, వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి సీఎం ఆదేశం

– గ్రామాల్లో డస్ట్‌బిన్స్‌ లేని వాళ్లకు డస్ట్‌బిన్స్‌ ఇవ్వాలని సీఎం ఆదేశం

–విలేజీ క్లినిక్స్‌ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలన్న సీఎం

–అలాగే గ్రామంలో పారిశుద్ధ్యం పైనా నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్న సీఎం

–క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులను పరిశుభ్రం చేయించాలన్న సీఎం

– వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టి పెట్టాలన్న సీఎం 

–మురుగునీటి కాల్వల నిర్వహణ పైనా అధికారులు దృష్టి సారించాలన్న సీఎం

–ఎక్కడా కూడా మురుగునీరు నిల్వ లేకుండా చేయాలని, దీన్నొక సవాల్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశం

–అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం

– మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలన్న సీఎం 


– క్లాప్‌ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సమర్ధులైన అధికారులను పెట్టాలని సీఎం ఆదేశం

– వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి : అధికారులకు సీఎం నిర్దేశం


ఈ సమీక్షా సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ పి బసంత్‌ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments