కరెంటు పరిస్థితులపై సీఎం సమీక్ష
అమరావతి (ప్రజా అమరావతి):
– రాష్ట్రంలోకరెంటు పరిస్థితులపై అధికారులతో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
– ఇంధన శాఖకార్యదర్శి ఎన్.శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్సహా పలువురు అధికారులు హాజరు.
– బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపైనా నిశితంగా సమీక్ష చేసిన సీఎం.
– ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరాచేస్తున్నామని తెలిపిన అధికారులు.
– ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆమేరకు తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని తెలిపిన అధికారులు.
– మహానది కోల్ఫీల్డ్స్ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని తెలిపిన అధికారులు
– రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని తెలిపిన అధికారులు.
– థర్మల్విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశం.
– సింగరేణి సహా కోల్ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశాలు.
– బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పుల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపైకూడా ఆలోచనలు చేయాలన్న సీఎం.
– దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయన్న సీఎం.
– దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్న సీఎం.
– పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్కూడా అందుబాటులోకి వస్తోందని తెలిపిన అధికారులు.
– కావాల్సిన విద్యుత్ను సమీకరించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు.
– తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం ఆదేశం.
– 6300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుత్ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం.
– సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం.
– ఈప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.
addComments
Post a Comment