శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి): 


 ప్రతిరోజు ch. మేఘన గారి పేరు మీద రూ.1,25,116/-లు మరియు శ్రీ ch. శశిధర్ గారి పేరు మీద రూ.1,25,116/-లు, వెరసి మొత్తం రూ.2,50,232/-లు అన్నదానం జరుపుటకు గాను  భారతీ నగర్, విజయవాడ కు చెందిన శ్రీమతి ch.నాగలక్ష్మి మరియు శ్రీ వి.రంగా రావు దంపతులు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి  డి.భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.

Comments