అమరావతి (ప్రజా అమరావతి);
*అమరావతి: వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
డిజిటల్ లైబ్రరీల నిర్మాణాల ప్రగతిపై సీఎంకు వివరాలందించిన అధికారులు
రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు నిర్మాణం
మూడు దశల్లో విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నామన్న అధికారులు
తొలివిడతలో చేపడుతున్న 4530 విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణపనుల ప్రగతిపై సీఎంకు వివరాలందించిన అధికారులు
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
ప్రతి విలేజ్ డిజిటల్ లైబ్రరీకి అంతరాయంలేని బ్యాండ్విడ్త్తో ఇంటర్నెట్ను ఇవ్వాలన్న సీఎం
తాజాగా వస్తున్న టెక్నాలజీని వినియోగించుకోవాలన్న సీఎం
అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం
ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం
వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి :
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉపయోగపడాలి :
విలేజ్ డిజిటల్ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలన్న సీఎం
వీటి నిర్వహణపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అధికారులకు సీఎం ఆదేశం
జనవరి నాటికి తొలిదశలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామన్న అధికారులు
అదే సమయంలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలన్న సీఎం
ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్టాప్ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఐరన్ రాక్స్, పుస్తకాలు, మేగజైన్ల ఏర్పాటు తప్పనిసరి అన్న సీఎం
ఉగాదినాటికి ఫేజ్ 1లో కంప్యూటర్ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్ లైబ్రరీలు
డిసెంబరు 2022 నాటికి ఫేజ్ 2 పూర్తిచేసేలా కార్యాచరణ చేయాలన్న సీఎం
జూన్ 2023 నాటికి మూడో దశ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ లక్ష్యంగా నిరేశించుకోవాలన్న సీఎం
తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో అన్ఇంటరెప్టడ్ బ్యాండ్విడ్త్తో కూడిన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందన్న సీఎం
ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం మధుసూధన్ రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ ఎం నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment