శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ, IAS దంపతుల వారు..
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణి మోహన్, IAS గారు, ఆలయ ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు..
శ్రీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం చేసిన ఆలయ స్థానాచార్యులు మరియు వేదపండితులు..
అనంతరం శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేసిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి గార్లు.
అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ దంపతుల వారు..
addComments
Post a Comment