హెల్త్‌ హబ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం



*కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


అమరావతి (ప్రజా అమరావతి);

*మెడికల్‌ కాలేజీలు, హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్ష*

హెల్త్‌ హబ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం


హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యంకోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు : అధికారులకు స్పష్టం చేసిన సీఎం

మన రాష్ట్రంలోనే చికిత్స అందించే విధంగా ఉండాలి:

ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలి: సీఎం

ఆ రకమైన వైద్య సేవలు స్ధానికంగానే ప్రజలకు అందుబాటులోకి రావాలన్న సీఎం

మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్న సీఎం 


*రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష*

కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే..వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం

ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలి : అధికారులకు సీఎం ఆదేశం

పనులు శరవేగంగా ముందుకు సాగాలి : సీఎం 


*ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌పైనా సీఎం సమీక్ష*

కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌సీల్లో నాడు– నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు.. వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం

జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలన్న సీఎం

విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం


మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం

స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టిపెట్టామన్న సీఎం

స్వేచ్ఛ ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామన్న సీఎం

నెలకు ఒక్కసారి ఈ రకమైన కార్యక్రమం చేపడుతున్నాం : సీఎం

వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం


ఆరోగ్య శ్రీ పై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్‌ పెట్టాలన్న సీఎం

ఆరోగ్య శ్రీ రిఫరెల్‌ మీద ప్రచారం ఉండాలన్న సీఎం

ఆరోగ్య మిత్రల ఫోన్‌నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌లో ఉంచాలన్న సీఎం

ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలన్న సీఎం

డిజిటల్‌ పద్ధతుల్లో పౌరులకు ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలి : సీఎం ఆదేశం

108 వెహికల్స్‌ సిబ్బందికి కూడా రిఫరెల్‌ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలన్న సీఎం


*ఏపీ డిజిటల్‌ హెల్త్‌పై సీఎం సమీక్ష*

హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలన్న సీఎం

పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలన్న సీఎం

దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందన్న సీఎం


బ్లడ్‌ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలన్న సీఎం

104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌కార్డుల్లో పొందుపర్చాలన్న సీఎం


డిజిటిల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ఐడీలు క్రియేట్‌చేస్తున్నామని తెలియజేసిన అధికారులు


*కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు.* 


రాష్ట్రంలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 9,141

రికవరీ రేటు 98.86 శాతం

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 2201

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు 313 

హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 6627

జీరో కేసులు నమోదైన సచివాలయాలు 11,997

పాజిటివిటీ రేటు 1.62 శాతం

0 నుంచి 3 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 12

3 లోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా 1

 

ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బెడ్స్‌ శాతం 92.27 శాతం

ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్‌ 69.70 శాతం 

104 కాల్‌సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌ 649


*థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత*

మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ 20,964

ఇంకా రావాల్సినవి 2,493

అందుబాటులో ఉన్న డి టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లు 27,311 

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు 140 

అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిగా అందుబాటులో రానున్న ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు


*వ్యాక్సినేషన్‌* 

సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు 1,38,32,742

రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు 1,44,94,731

మొత్తం వ్యాక్సినేషన్‌ చేయించుకున్నవారు 2,83,27,473

వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు 4,28,22,204 

వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలన్న సీఎం


ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి యస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments