శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): మహామండపము 6 వ ఫ్లోర్ నందు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ , దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF సిబ్బంది పర్యవేక్షించారు.
ఈ రోజు హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 2,87,83,153/- లు.
హుండీల ద్వారా వచ్చిన బంగారం: 546 గ్రాములు,
హుండీల ద్వారా వచ్చిన వెండి: 9 కేజీల 553 గ్రాములు
హుండీ లెక్కింపు కార్యక్రమం రేపు కూడా కొనసాగనున్నది.
శ్రీ అమ్మవారి సేవలో...
ఆలయ పాలకమండలి చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి.
addComments
Post a Comment