అమరావతి (ప్రజా అమరావతి);
*హస్తిన బాటలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
రాష్ట్ర ప్రగతికి సంబంధించి గతంలో చర్చించిన ప్రాజెక్టుల ఫాలో అప్, కొత్త అభివృద్ధి అంశాలపై చర్చే ప్రధాన అజెండా
20,21 తేదీలలో మంత్రి మేకపాటి ఢిల్లీ పర్యటన
కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, ఎమ్ఎస్ఎమ్ఈ శాఖల మంత్రులు సహా నీతి ఆయోగ్ సీఈవోలను కలవనున్న మంత్రి మేకపాటి
కేంద్ర ఐ.టీ, విమానయాన, నైపుణ్య, ఓడరేవులు, పోర్టుల శాఖ మంత్రులను కలిసే అవకాశం
వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లు సహా పలు కీలక అంశాలను సంబంధిత శాఖల కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు సన్నద్ధమైన ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి
రాష్ట్రానికి రావలసిన నిధులు సహా పలు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్న మంత్రి మేకపాటి
మంత్రి మేకపాటి వెంట ఢిల్లీ పర్యటనకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్
addComments
Post a Comment