విజయవాడ (ప్రజా అమరావతి);
జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా : గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్
అక్టోబర్ 19 నాడు నిర్వహించ తలపెట్టిన జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదినంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గతంలో బుధవారం సెలవుగా ప్రకటించిన మిలాద్ - ఉన్ - నబీ పండుగ సెలవును మంగళవారంకు మార్చడంతో అక్టోబర్ 19 నాడు నిర్వహించ తలపెట్టిన జగనన్న తోడు కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. బుధవారం ఉదయం 11 గంటలకు జగనన్న తోడు లబ్ధిదారుల వడ్డీ సొమ్మును తిరిగి బ్యాంకుల్లో వారి ఖాతాలలో జమ చేసే కార్యక్రమంను యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
addComments
Post a Comment