ప్రశాంతంగా ముగిసిన నంద్యాల జెడ్ పి టి సి, 7 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల పోలింగ్



*★ ప్రశాంతంగా ముగిసిన నంద్యాల జెడ్ పి టి సి, 7 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల పోలింగ్  :-*


*★ ఓటు హక్కు వినియోగించుకున్న 41,018 మంది ఓటర్లు....64.34 శాతం పోలింగ్‌ :-*


*★ ఈ నెల 18 తేదీన కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు :-*


*★ జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వర రావు :-*


కర్నూలు, నవంబర్ 16 (ప్రజా అమరావతి):-


జిల్లాలో నంద్యాల జడ్పీటీసీ, 7 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అందుకు సహకరించిన ఓటర్ లతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులందరికీ జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వర రావు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.


జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ....నంద్యాల జెడ్ పిటిసి, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి -3, టి.గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందన్నారు. జెడ్ పిటిసి, 7 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 68 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 63,748 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 20,486, స్త్రీలు 20,531 మంది, ఇతరులు 01, మొత్తం 41,018 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించుకోగా....64.34 % పోలింగ్ నమోదయ్యాయన్నారు.


7 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం ఓటర్లు 19,905 ఉండగా అందులో పురుషులు 6,776, స్త్రీలు 6,301 మంది, మొత్తం 13,077 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించుకోగా...65.70% నమోదైంది.


నంద్యాల జెడ్ పిటిసి సంబంధించి మొత్తం ఓటర్లు 43,843 ఉండగా అందులో పురుషులు 13,710, స్త్రీలు 14,230 మంది, ఇతరులు 01, మొత్తం 27,941 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించుకోగా...63.73 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా కలెక్టర్ తెలిపారు.


పకడ్బందీగా కౌంటింగ్ ఏర్పాట్లు :-


నంద్యాల జెడ్ పి టి సి, 7 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఈ నెల 18 తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని, కౌంటింగ్ సజావుగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.


కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ :-


కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉదయం 7 గంటల నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు నంద్యాల జెడ్ పి టి సి, 7 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిపిఓ ప్రభాకరరావు, డి ఆర్ ఓ పుల్లయ్య , ఎన్నికల నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.



Comments