గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.

 గుంటూరు (ప్రజా అమరావతి);


గుంటూరు మెడికల్ కాలేజ్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని..

మెడికల్ కాలేజీ కి విచ్చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని గారికి ఘన స్వాగతం పలికిన మెడికల్ కాలేజ్ సభ్యులు, స్టూడెంట్స్, ముందుగా కాలేజ్ ప్రొఫెసర్స్ తో సమావేశమైన మంత్రి ఆళ్ల నాని..గుంటూరు వైద్య కళాశాల ఏర్పడి 75 ఏళ్లుయిన సందర్భంగా కళాశాల వేడుకల్లో నేను పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నా మంత్రి ఆళ్ల నాని..

గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరించిన



రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత..

గుంటూరు వైద్య కళాశాల 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి చొరవతో ఏర్పడిందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..

దాత ఆచంట రుక్మిణమ్మ పద్మావతి గారు స్థలం ఉచితంగా అందచేయడం జరిగిందని మంత్రి ఆళ్ల నాని గుర్తు చేశారు..

ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు అందరూ ఎంతోమంది దేశం నలుమూలల వైద్యులుగా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..

మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతు డబ్ల్యుహెచ్వో సూచనలు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఒమ్రికాన్ విదేశాల్లో వ్యాపిస్తున్నడంతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు మేరకు ముందస్తు జాగ్రత్తలతో వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి ఆళ్ల నాని తెలియజేశారు..ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని మంత్రి ఆళ్ల నాని సూచించారు..రాష్ట్రంలో ఏ వేవ్ వచ్చినా, ఏ వేరియంట్ వచ్చిన ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మంత్రి ఆళ్ల నాని తెలిపారు..

కరోనా మహమ్మారి సమయంలో డాక్టర్లు అందించిన సేవలు, త్యాగాలు అభినందలు తెలియజేసిన మంత్రి 

ఆళ్ల నాని..

రాష్ట్రంలో డాక్టర్లు సహకారం మరువలేనిది అని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని..

 నాడు - నేడు - ద్వారా ప్రతి పేద విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో, రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య రంగానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిన ఘనత కేవలం మన ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి గారికే దక్కుతుందని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని..

రాష్ట్రంలో ఏడు ఐటిడిఏ ల పరిధిలో ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజనులు, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండేలా మెడికల్ వైద్య సేవలకు చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తయ్యాయని తెలిపిన మంత్రి ఆళ్ల నాని..రాష్ట్రంలో ప్రతి నాలుగు వేల జనాభాకు ఒక విలేజ్ క్లీనిక్ ఉండేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని.. 

వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని.. 

మన ప్రియతమ నేత, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్వప్నం ఆరోగ్య శ్రీ ని పేద ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..డాక్టర్లు చేస్తున్న పని కృషి వెలకట్టలేనిది, అదేవిధంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి పేద మధ్యతరగతి ప్రజల కోసం 1000 రూపాయలు దాటిన వైద్యం ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ లో పెట్టి వైద్యాన్ని మరింత పేద ప్రజలకు చేరువ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని..

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2449 రకాల జబ్బుల గాను క్యాన్సర్ కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని.. 

 ఒక్క ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లక్షలమంది లబ్ది పొందతున్నారని తెలిపిన మంత్రి ఆళ్ల నాని..

మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో నుంచి పుట్టిన "ఫ్యామిలీ డాక్టర్" కాన్సెప్ట్ ద్వారా ప్రతి నెలకు రెండు సార్లు 104 వాహనం ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్లి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపిన మంత్రి ఆళ్ల నాని..ఒక కుటుంబానికి - ఒక ఫ్యామిలీ డాక్టర్ - మంత్రి ఆళ్ల నాని.. 108 అంబులెన్స్ ద్వారా 20 నిమిషాలలో సంఘటన ప్రాంతాలకు వెళ్ళి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుందని పేర్కొన్నారు మంత్రి ఆళ్ల నాని.. పట్టణాల్లో ఉన్న మెడికల్ సేవలు ఇప్పుడు ప్రతీ పేద వాడికి అందాలనే లక్ష్యంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు పేర్కొన్నా మంత్రి ఆళ్ల నాని..

డాక్టర్లు మీ అందరి సహాయ, సహకారాలు ఎప్పుడూ ఉండాలని కోరిన మంత్రి ఆళ్ల నాని.. 

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.. కోవిడ్ మహమ్మారి దేశంలో ఏ విధంగా విస్తరించిందో దాని కట్టడికి అన్ని రాష్ట్రాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ఆదర్శం, దానికి కారణం కేవలం మన డాక్టర్స్, మెడికల్ సిబ్బంది మాత్రమే అని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని..ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి వీటి ద్వారా సూపర్ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు పేద మధ్యతరగతి ప్రజలకు దగ్గరలో అందుబాటులోకి వస్తాయని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..ఇప్పటికే మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి అని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..ప్రతి చిన్న గ్రామంలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినిక్స్ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కెఎస్ లక్ష్మణరావు,  జిల్లా ప్రజా పరిషత్  ఛైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెనీ క్రిస్టినా సురేష్, మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ సజీల,  జిడిసిసి బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము,ప్రిన్సిపల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు..


Comments