"రైతులతో కాకాణి పర్యటన"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలను రైతులు, ప్రజలతో కలిసి సందర్శించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు.
చెరువులు, రిజర్వాయర్లు కోతకు గురికాకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం.
సర్వేపల్లి రిజర్వాయర్ 2014లో కురిసిన భారీ వర్షాలకు ప్రమాదపు అంచున చేరుకుంది.
సర్వేపల్లి రిజర్వాయర్ ను గురించి తెలుగుదేశం 5 సంవత్సరాల కాలం పట్టించుకోకుండా, ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావుడిగా జీవో జారీ చేసి చేతులు దులుపుకున్నారు.తెలుగుదేశం పార్టీ ప్రమాద బారిన పడే అవకాశం ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ నే పట్టించుకోలేదంటే, రైతాంగం పట్ల వారి శ్రద్ధ అర్థమవుతుంది.
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రిజర్వాయర్ మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయించి, పనులు ప్రారంభించాం.రాబోవు రబీ సీజన్ కల్లా, సర్వేపల్లి రిజర్వాయర్ కు మరమ్మతులు పూర్తి చేసి, పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంచేలా చర్యలు చేపడతాం.
భారీ వర్షాల నేపథ్యంలో తిక్కవరపుపాడు చెరువుకి గండిపడినా, ఒక్క సెంటు పొలం కూడా నష్టపోకుండా తక్షణ చర్యలు చేపట్టాం.సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి చెరువులకు, కాలువలకు పడిన గండ్లు పూడ్చివేసి, సజావుగా, సాఫీగా సాగునీరందిస్తాం.
భారీ వర్షాలతో నష్టం వాటిల్లిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం.మరో భారీ వర్ష సూచన నేపథ్యంలో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.
addComments
Post a Comment