అమరావతి (ప్రజా అమరావతి);
*గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారం పంపిణీ*
*2021 సెప్టెంబర్లో సంభవించిన గులాబ్ సైక్లోన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ. 22 కోట్ల పంట నష్టపరిహారం నేడే (16.11.2021, మంగళవారం) క్యాంప్ కార్యాలయం నుంచి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం*
*ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవడానికి శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు*
– ఈ–క్రాప్ ఆధారంగా పారదర్శకంగా సచివాలయాల్లో జాబితా ప్రదర్శించి మరీ నమోదైన వాస్తవ సాగుదార్లకు పంట నష్టపరిహారం పంపిణీ
– గత రెండు వారాలుగా పడుతున్న వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్ధాయిలో బృందాల ఏర్పాటు
– కడప, అనంతపురం జిల్లాల్లో రబీలో విత్తనాలు వేసుకుని, వర్షాల వల్ల మొలక శాతం దెబ్బతిన్న శనగ రైతులకు 80 శాతం రాయితీతో మళ్ళీ విత్తుకోవడానికి విత్తనం సరఫరా
– ఈ రబీ సీజన్ ముగిసేలోగా, ఖరీఫ్ మొదలుకాకముందే పంట నష్టపరిహార పంపిణీ కూడా జరుగుతుంది
*ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు పంట నష్టపరిహారం క్రింద 13.96 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్పుట్ సబ్సిడీ సాయం రూ. 1,071 కోట్లు*
addComments
Post a Comment