భారత ఉపరాష్ట్రపతి కి ఘనంగా వీడ్కోలు

 

నెల్లూరు, నవంబర్ 14 (ప్రజా అమరావతి)


: మూడు రోజుల నెల్లూరు పర్యటన ముగించుకుని రేణిగుంట కు పయనమైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుకి వెంకటాచలం రైల్వే స్టేషన్ లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటల  సమయంలో వెంకటాచలం రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఉపరాష్ట్రపతి ప్రత్యేక రైలులో రేణిగుంటకు పయనమవగా  జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, ఎమ్మెల్సీ శ్రీ వాకాటి నారాయణరెడ్డి, గుంటూరు రేంజ్  డిఐజి శ్రీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ శ్రీ విజయ రావు, జిల్లా జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ్ ఖరె, ట్రైనీ కలెక్టర్ శ్రీ పర్హాన్ అహ్మద్ ఖాన్, ఆర్ డి వో లు శ్రీ చైత్ర వర్షిని, శ్రీ శీనా నాయక్, బిజెపి నేతలు  తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Comments