ఆచంట (ప్రజా అమరావతి):
ఆచంట నియోజకవర్గ సీఎం కప్ ఆటలు పోటీలు గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గారు 1-12-2021 బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మార్టేరు శ్రీ వేణుగోపాల ఉన్నత పాఠశాలలో ప్రారంభిస్తారని ఆచంట మండల అభివృద్ధి అధికారి మంగళవారం ఒక ప్రకటన లో తెలియజేశారు ఈ పోటీల్లో భాగంగా బాస్కెట్బాల్, బాక్సింగ్ ,అథేలిటిక్స్, బ్యాడ్మింటన్ , తదితర పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలిచినవారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారన్నారు. . ఈ కార్యక్రమంలో పలు పాఠశాలలు విద్యార్థులు పాల్గొంటారు.
ఆచంట పెనుమంట్ర, పెనుగొండ ,పోడూరు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమనికి హాజరు అవుతారు
addComments
Post a Comment