శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): రాజేశ్వరీ నగర్, కాకినాడ కి చెందిన శ్రీ ఎం.శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారి అలoకారం నిమిత్తం 1 లక్ష రూపాయలు విలువ జేయు 7.3 గ్రాములు బరువు గల బంగారు డైమండ్ ముక్కుపుడుకను ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారిని కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ పాలకమండలి ఛైర్మన్ గారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
addComments
Post a Comment