శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);
నెల్లూరు జిల్లా పరిస్థితి పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
జిల్లాలో వరదల కారణంగా జరిగిన ప్రాణ, రైతుల పంట నష్టాలపై వాకబు.
ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం, అనంతసాగరం, చేజర్ల మండలాలపైనా రివ్యూ
సోమశిల ఆనకట్టకు పక్కనే ఉన్న శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన కామాక్షి సమేత సోమేశ్వర ఆలయం వరద ధాటికి ధ్వంసమవడం, విగ్రహం కొంత దూరం కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి మేకపాటి.
ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సోమశిల ప్రాజెక్టు సమీపంలో ఉన్న సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించిన మంత్రి మేకపాటి.
సోమేశ్వర ఆలయం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, వంశపారంపర్య ధర్మకర్త ఉప్పల విజయ్ కుమార్ సహా పరిసర ప్రాంతాల వైసీపీ నాయకులు గుండుబోయిన వెంకటరమణ, గుండుబోయిన ఈశ్వరయ్య, ఎద్దుల శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజలతో ఫోన్లో మాట్లాడిన మంత్రి గౌతమ్ రెడ్డి.
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం , వైఎస్ఆర్ కడప జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకునే ఆ ఆలయాన్ని పునర్ నిర్మిస్తామని, విగ్రహాలను పునఃప్రతిష్ట చేస్తామని వెల్లడించిన మంత్రి గౌతమ్ రెడ్డి
ఎంతో శ్రమకోర్చి కొట్టుకుపోయిన స్వామి విగ్రహాలను తీసుకొచ్చేందుకు కృషిచేసిన సోమశిల యువతను అభినందించిన మంత్రి మేకపాటి
చోళుల కాలం నాటి పురాతన ఆలయం చెక్కుచెదరకుండా ముందస్తు జాగ్రత్తలతో సోమశిల డ్యామ్ నిర్మించినప్పటికీ ఇలా ప్రకృతి విపత్తులో గుడి గోపురం, ఎన్నో ఏళ్ళ నాటి మహా వృక్షాలు నేలకొరగడం బాధాకరమన్న మంత్రి మేకపాటి.
ఆత్మకూరు నియోజకవర్గంలో వర్షం ప్రభావం, వరద పరిస్థితిపై ఆర్డిఓ చైత్ర వర్షిణి, ఆరు మండలాల వైసిపి నాయకులు, ప్రజలను అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి*
ఢిల్లీ పర్యటనలో ఉన్నా మంత్రి కార్యాలయం ద్వారా సమాచారం తెలుసుకుంటూ సిబ్బందిని, నియోజకవర్గ నాయకులను ప్రజలకు అందుబాటులో ఉండేలా అప్రమత్తం చేసిన మంత్రి మేకపాటి
addComments
Post a Comment