స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం స్ఫూర్తిని నిల‌బెట్టండి

 స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం స్ఫూర్తిని నిల‌బెట్టండి


జిల్లా సంయుక్త కలెక్టర్  హౌసింగ్  నిశాంతి


అనంతపురం, నవంబర్11 (ప్రజా అమరావతి): దేశంలో ప్ర‌జాస్వామ్యం మ‌నుగ‌డ సాగించడానికి, స‌మాచార హ‌క్కు చ‌ట్టం ఎంతో కీల‌క‌మ‌ని, దాని స్ఫూర్తిని నిల‌బెట్టాల‌ని జిల్లా  సంయుక్త కలెక్టర్ (  హౌసింగ్)  నిశాంతి  స్ప‌ష్టం చేశారు. దీనిపై ప్ర‌తీఒక్క‌రూ అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు.


         స‌మాచార హ‌క్కు చ‌ట్టం వారోత్స‌వాల్లో భాగంగా, గురువారం

  శ్రీ కృష్ణదేవరాయ  యూనివర్సిటీ నందు గల  పాలిమర్ సైన్స్  డిజిటల్  కాన్ఫరెన్స్ లో  డిపార్ట్ మెంట్ అఫ్  లా,  యూనివర్సిటీ  , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  మరియు  ప్రొహిబిషన్  & ఎక్సైజ్  డిపార్ట్ మెంట్ లు సంయుక్తంగా  కలసి   సమాచార హక్కు  చట్టం అవగాహనా  సదస్సు  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో J .రామ మోహన  రావు ,అడిషనల్  సూపరింటెండెంట్  అఫ్ పోలీస్ , SEB ,అనంతపురము  , ప్రొఫెసర్  జీవన్ కుమార్,  సమన్వయ కార్యకర్తగా Dr .R .S కుమరేశ్వరన్ , నోడల్ ప్రొహిబిషన్  & ఎక్సైజ్ సూపరింటెండెంట్, పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ 

మాట్లాడుతూ, పౌరుల చేతిలో స‌మాచార హ‌క్కు చ‌ట్టం వ‌జ్రాయుధం లాంటిద‌ని పేర్కొన్నారు. ఈ చ‌ట్టం వ‌ల్ల పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త ఏర్ప‌డుతుంద‌న్నారు. ప్ర‌తీ పౌరుడు స‌మాచారాన్ని తెలుసుకొనే హ‌క్కు ఈ చ‌ట్టం వ‌ల్ల ల‌భిస్తుంద‌న్నారు. ఆర్‌టిఐ సెక్ష‌న్ 41బి ప్ర‌కారం, ప్ర‌తీ ప్ర‌భుత్వ కార్యాల‌యంలో 17 అంశాల‌తో కూడిన స‌మాచారాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచాల‌న్నారు. అధికారులంతా త‌ప్ప‌నిస‌రిగా స‌మాచార‌హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా, ఈ చ‌ట్టం స్ఫూర్తిని నిల‌బెట్టాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో   విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు. విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


       

Comments