సమాచారహక్కు చట్టం స్ఫూర్తిని నిలబెట్టండి
జిల్లా సంయుక్త కలెక్టర్ హౌసింగ్ నిశాంతి
అనంతపురం, నవంబర్11 (ప్రజా అమరావతి): దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి, సమాచార హక్కు చట్టం ఎంతో కీలకమని, దాని స్ఫూర్తిని నిలబెట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్) నిశాంతి స్పష్టం చేశారు. దీనిపై ప్రతీఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా, గురువారం
శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నందు గల పాలిమర్ సైన్స్ డిజిటల్ కాన్ఫరెన్స్ లో డిపార్ట్ మెంట్ అఫ్ లా, యూనివర్సిటీ , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లు సంయుక్తంగా కలసి సమాచార హక్కు చట్టం అవగాహనా సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో J .రామ మోహన రావు ,అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ , SEB ,అనంతపురము , ప్రొఫెసర్ జీవన్ కుమార్, సమన్వయ కార్యకర్తగా Dr .R .S కుమరేశ్వరన్ , నోడల్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్, పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్
మాట్లాడుతూ, పౌరుల చేతిలో సమాచార హక్కు చట్టం వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. ఈ చట్టం వల్ల పాలనలో పారదర్శకత ఏర్పడుతుందన్నారు. ప్రతీ పౌరుడు సమాచారాన్ని తెలుసుకొనే హక్కు ఈ చట్టం వల్ల లభిస్తుందన్నారు. ఆర్టిఐ సెక్షన్ 41బి ప్రకారం, ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో 17 అంశాలతో కూడిన సమాచారాన్ని ప్రదర్శనకు ఉంచాలన్నారు. అధికారులంతా తప్పనిసరిగా సమాచారహక్కు చట్టాన్ని అమలు చేయడం ద్వారా, ఈ చట్టం స్ఫూర్తిని నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు. విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment