అమరావతి పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం.



*-అధికారవికేంద్రీకరణతోనే రాష్ర్ట సమగ్రాభివృధ్ది సాధ్యమవుతుంది*


*-కర్నూలును న్యాయరాజధాని కాకుండా అడ్డుకుంటారా ?*


*- చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను సాగనివ్వం.*


*-న్యాయరాజధానికి సిపిఐ కట్టుబడి ఉంది*


*-న్యాయరాజధాని సాధనకు పాదయాత్రలు చేస్తాం.*


-అమరావతి పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం.



కర్నూలు (ప్రజా అమరావతి);

 అధికారవికేంద్రీకరణపరిరక్షణసమితి' ఆధ్వర్యంలో' అధికారవికేంద్రీకణ - మూడు రాజధానుల ఏర్పాటు' అనేఅంశంపై సదస్సులో కర్నూలులోజరిగినసదస్సులో పలువురు రాజకీయనేతలు మేధావులు,వక్తలు అని అభిప్రాయపడ్డారు.


          రాష్ట్రంలోని అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధిని ఆశించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడురాజధానులు ఏర్పాటుచేయాలని తీసుకున్ననిర్ణయంపై తెలుగుదేశంనేతలు అడ్డుతగలడం దారుణం. కేవలం అమరావతిలోల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో తక్కువధరకు సేకరించినభూములను ఎక్కువధరలకు అమ్ముకొని కోట్లాదిరూపాయలను సొమ్ముచేసుకునేందుకు చంద్రబాబు,ఆయన తనయుడు నారాలోకేష్‌ అక్కడి అమాయక రైతులనురెచ్చగొడుతున్నారు.టీడీపీ ముసుగులో చేపట్టినపాదయాత్రలో రైతులు ఎవరైనా ఉన్నారా? అందరూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, తెలుగుదేశంపార్టీనేతలు, కార్యకర్తలే పాదయాత్రలో ఉన్నారు. ఇప్పటికైనా అమరావతి రైతులు నిజాన్ని గ్రహించాలి. అలాగే ...ఎన్నోత్యాగాలు చేసిన కర్నూలువాసుల చిరకాలస్వప్నమైన న్యాయరాజధానిని సాధించుకునేందుకు కలిసిరాని రాజకీయనేతలందరు కాలగర్భంలో కలిసిపోకతప్పదని పలువురు మేధావులు, నేతలు హెచ్చరించారు. అమరావతి పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం అని స్పష్టం చేశారు.

                అధికార వికేంద్రీకరణ పరిరక్షణసమితి' ఆధ్వర్యంలో' అధికారవికేంద్రీకణ - మూడురాజధానులఏర్పాటు' అనేఅంశంపై సోమవారం ఉదయం కర్నూలులోని మెగాసిరిఫంక్షన్‌హాల్‌లో' సదస్సు నిర్వహించారు.అధికారవికేంద్రీకరణపరిరక్షణసమితి అధ్యక్షులు శ్రీ క్రిష్టఫర్‌ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు.


సదస్సులో పాల్గొన్న వారు ఏమన్నారంటే .........

రాయలసీమపౌరుషాన్నిచూపిస్తాం ... కాటసానిరాంభూపాల్‌రెడ్డి, పాణ్యంఎమ్మెల్యే మాట్లాడుతూ

పాణ్యం శాసనసభ్యుడు శ్రీ కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ 1953 నుంచిచారిత్రాత్మక త్యాగాలుచేసిన కర్నూలు వాసులు ఇక త్యాగాలు చేసేస్థితిలోలేరని, అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన న్యాయరాజధానిని సాధించుకునేందుకు రాయలసీమ పౌరుషాన్నిచూపిస్తాం అని అన్నారు. జిల్లాలోశ్రీశైలం ప్రాజెక్టు ఉన్నా,ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగులకు మించిఉంటేతప్ప ఆనీటిని ఇక్కడి రైతులు ఉపయోగించుకునేస్థితిలో లేరన్నారు. రాష్ట్రసమగ్రాభివృద్దిని ఆశించి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్ గారు మూడురాజధానులు ప్రకటిస్తే టీడీపీ అడ్డుకోవడం దారుణం. న్యాయరాజధానిని సాధించుకుంటే కర్నూలుజిల్లా ఎంతోఅభివృద్ధి చెందుతుంది. వేలమందికిఉద్యోగ, ఉపాధిఅవకాశాలులభిస్తాయి. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకు జరుగుతున్నఈ ఉద్యమంలోకలిసిరాని రాజకీయనేతలను ప్రజలేకాలగర్భంలోకలిపేస్తారు అని అన్నారు.కర్నూలు అభివృద్ధిని ఆశించి ఇక్కడి టీడీపీనేతల్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఇకనుంచి చేపట్టే ఉద్యమాల్లో కలిసి రావాలి అని కోరారు.  


పాదయాత్రలో  నిజమైన రైతులు ఉన్నారా? ... డా. జెసుధాకర్, కోడుమూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ

        చంద్రబాబు డైరెక్షన్‌లో సాగుతున్నఅమరావతి రైతుల పాదయాత్రలో నిజమైన రైతులుఉన్నారా? అని ప్రశ్నించారు. ఆ యాత్రలోరియల్‌ ఎస్టేల్‌ వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, టీడీపీనేతలు, కార్యకర్తలే ఉన్నారన్నారు. స్వార్థంతో పేద, మధ్యతరగతి రైతులనుంచి తక్కువధరకు కొనుగోలుచేసిన భూములకు కోట్లు సంపాదించాలని నిజమైనరైతులను మోసంచేసేందుకు టీడీపీనేతలు డ్రామాలు ఆడుతున్నారు. న్యాయరాజధానిని సాధించుకునేందుకు జిల్లాకుచెందిన మాజీకేంద్ర,రాష్ట్రమంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలతో మూడురాజధానులను అడ్డుకుంటే ప్రజలు క్షమించరు అని అన్నారు.


ఉద్యమానికి తొలి అడుగు పడింది ... డా.ఎస్‌ సంజీవ్‌కుమార్, కర్నూలుపార్లమెంట్‌ సభ్యులు. మాట్లాడుతూ

          రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన న్యాయరాజధాని సాధనకోసం తొలిఅడుగుపడింది.  పాదయాత్రలు, నిరాహారదీక్షలు, నిరసనదీక్షలు చేపట్టాల్సిఉంది అని ఎంపి సంజీవ్ కుమార్  అన్నారు. అవసరమైతే లక్షలమందితో దీక్షలు చేపట్టి ఈ అంశాన్నిదేశ ప్రజలందరికి తెలియజెప్పాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం అప్పట్లోనే 55వేలఎకరాలను ఇచ్చిన రైతులకు నేడు నీళ్లులేని పరిస్థితి ఉంది. జిల్లాలో 95 కిలోమీటర్లమేర తుంగభద్ర ప్రవహిస్తున్నా, తాగేందుకు కూడా నీరులేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. అన్నివిధాల నష్టపోయిన కర్నూలుజిల్లా న్యాయరాజధానితో అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్న తరుణంలో టీడీపీ అడ్డుకోవడం, కేసులు వేయడం వంటిచర్యలకు పాల్పడుతోందని అన్నారు. న్యాయరాజధాని ఇక్కడ ఏర్పాటైతే 25 వేల కుటుంబాలు ఇక్కడికి వస్తాయి. తద్వారా అభివృధ్ది జరుగుతుందని అభిప్రాయపడ్డారు.


అమరావతి పాదయాత్ర సీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం  బీక్రిష్టఫర్, 


అధికారవికేంద్రీకరణపరిరక్షణసమితి అధ్యక్షులు మాట్లాడుతూ

   అమరావతి రైతులపేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయిస్తున్నపాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ స్పూర్తితో చేపట్టిన అధికారవికేంద్రీకణ,  మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. 


న్యాయరాజధాని సాధనకు పోరు షురూ చేయాలి  ... బీ.వై.రామయ్య, నగరమేయర్ మాట్లాడుతూ

కర్నూలులో ఏర్పాటు చేయాలనుకున్న న్యాయరాజధానిని సాధించుకునేందుకు ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇప్పటికే కర్నూలు ప్రజలు మూడు పర్యాయాలు మోసపోయారన్నారు. సోనియాగాంధీ కుట్రతో రాష్ట్రం విడిపోయింది. శ్రీభాగ్‌ ఒప్పంధం నిర్ణయాలను అమలుచేసేందుకు రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నేతలు ఈప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడం వారి రాజకీయభవిష్యత్తుకే మంచిదికాదని అన్నారు.   కరువుకాటకాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఇక్కడి రైతులను ఆదుకోలేని టీడీపీనేతలు అమరావతి రైతుల నకిలీఉద్యమాలకు చందాలు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.


న్యాయరాజధానికి సిపిఐ కట్టుబడి ఉంది ... రామక్రిష్ణారెడ్డి, సీపీఐనేత మాట్లాడుతూ

కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేసే అంశానికి తమపార్టీ కట్టుబడిఉందని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణపరిరక్షణసమితి భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమాలకు సీపీఐ సంపూర్ణ సంఘీభావం ప్రకటించడంతోపాటు ప్రత్యక్షంగాపాల్గొంటుంది.ఈమేరకు పార్టీనిర్ణయం తీసుకుందని అన్నారు.


3 రాజధానులకు మధ్దతుగా 450 రోజులుగా దీక్షలు చేస్తున్నాం ... శ్రీనివాసరావు,  నవ్యాంధ్ర ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షులు (గుంటూరు) మాట్లాడుతూ

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మూడురాజధానులకు మద్దతుగా 450 రోజులుగా అమరావతిలో దీక్షలు చేస్తూనే ఉన్నామని శ్రీనివాసరావు అన్నారు. అమరావతి రైతులపేరుతో కొనసాగుతున్న పాదయాత్రలు వట్టిబూటకం. కేవలం చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో వారంతా కేవలం పాత్రధారులే. తమ ఆస్తులను ఇంకా పెంచుకునేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్‌ అక్కడి అమాయకరైతులను రెచ్చగొడుతున్నారు అని అన్నారు. భారతరాజ్యాంగస్పూర్తితోనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు అని తెలియచేశారు.


న్యాయ రాజధాని సాధనకు పాదయాత్రలు ... సీహెచ్‌ వెంగళరెడ్డి, ఏపీఎన్‌జీఓస్‌ జిల్లాఅధ్యక్షులు మాట్లాడుతూ

కర్నూలులో న్యాయరాజధానిని సాధించుకునేందుకు కర్నూలునుంచి హైకోర్టువరకు పాదయాత్రలు చేపడదాం అని అన్నారు. అందుకు అవసరమైతే ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, ప్రజా, మహిళా సంఘాలతో కలిసి ఉద్యమాన్నిఉధృతం చేద్దాం. ఉద్యమాన్ని గ్రామస్థాయిలోకి తీసుకుపోయేందుకు ఉద్యోగులందరం ఒక వారం రోజులపాటు మాస్‌ క్యాజువల్‌ లీవ్‌ పెట్టేందుకైనా వెనుకాడమని, న్యాయరాజధాని కర్నూలుహక్కు అని అన్నారు. 




ఎంతటిత్యాగాలకైనాసిద్దం ... ఐవిజయకుమార్‌రెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు మాట్లాడుతూ

కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటయ్యేంతవరకు ఉద్యమాలను ఉధృతంచేసే ప్రక్రియలో ఎంతటిత్యాగాలను చేసేందుకైనాసిద్దం అని విజయకుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిన రాయలసీమను అభివృద్ధిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటుచేసేందుకు ప్రకటించినా, కొందరు తమ స్వార్థంకోసం అడ్డుకోవడం దారుణం అని అన్నారు.న్యాయరాజధాని ఇక్కడ ఏర్పాటైతే న్యాయపరమైన అనేక కార్యాలయాలు వస్తాయి.అని అన్నారు.  


ఈసదస్సులో  డిప్యూటీ మేయర్‌ రేణుక, మాజీఎంపీబుట్టారేణుక, మాజీఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి,జాతీయకిసాన్‌ సంఘ్‌ ఉపాధ్యక్షులు వీ. సిద్దారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జీ.పుల్లయ్య, కేవీసుబ్బారెడ్డి, ఏపి ఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరిరెడ్డి, రాయలసీయవిద్యార్థి, యువజనసంఘాల జేఏసీ కన్వీనర్‌ శ్రీరాములు, కోకన్వీనర్‌ ఆర్‌ చంద్రప్ప,  సీనియర్‌ న్యాయవాదులు వైజయరాజు, నాగలక్ష్మిదేవి, రిటైర్డు తహసీల్దార్‌ రోషన్‌ ఆలీ, సీపీఐనేత రామక్రిష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image