గిరిజన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు, స్ధానిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళిన ఎమ్మెల్యేలు


అమరావతి (ప్రజా అమరావతి);


శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి,  చెట్టి ఫాల్గున, కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, నాగులాపల్లి ధనలక్ష్మి.

గిరిజన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు, స్ధానిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళిన ఎమ్మెల్యేలు


*


గిరిజన ప్రాంతాల అభివృద్దికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే తీసుకోవాలని సీఎంవో అధికారులకు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఆదేశాలు.

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం (ఉపాధి హమీ పనుల ద్వారా నిర్ధేశించిన రోడ్లను పూర్తి చేయడం), ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్‌ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్ళేందుకు అవసరమైన రైస్‌ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం వంటి పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్ళిన గిరిజన ఎమ్మెల్యేలు.

జీవో నెంబర్‌ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచించిన సీఎం, షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం కొరకు రానున్న అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో వెల్లడించిన సీఎం.

గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటికి వెంటనే పరిష్కారం లభించేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

Comments