శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): కోటి దీపోత్సవము మరియు గిరిప్రదక్షిణ కార్యక్రమముల సందర్భంగా మల్లిఖార్జున మహామండపము 6 వ అంతస్తు నందు ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు శ్రీ కనుగుల వెంకటరమణ(బాలా) , స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వైదిక కమిటీ సభ్యులు శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి వారి ఆధ్వర్యములో ప్రెస్ మీట్ నిర్వహించబడినది. ఈ సందర్భంగా చైర్మన్ , కార్యనిర్వాహణాధికారి మరియు ఆలయ స్థానాచార్యులు వారు మాట్లాడుతూ రేపు అనగా ది.18-11-2021 సా.06 గం.లకు నిర్వహించుచున్న కోటి దీపోత్సవము మరియు ది.19-11-2021 ఉదయం 06 గం.లకు నిర్వహించు గిరిప్రదక్షిణ కార్యక్రమ వివరాలు తెలియజేసి కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గురు భవానీ శ్రీ ఎల్. ఆర్.రావు , ఉపకార్యనిర్వాహక ఇంజినీర్ వార్లు, సహాయ కార్య నిర్వహణాధికారి వార్లు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment