.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు


 


- ఎ


మ్మెల్యే సింహాద్రి మాతృమూర్తి భారతమ్మకు మంత్రి కొడాలి నాని ఘన నివాళి 

- మంత్రి పేర్ని నానితో కలిసి పరామర్శ 



అవనిగడ్డ, డిసెంబర్ 4 (ప్రజా అమరావతి): అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు  మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు. శనివారం రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును మంత్రి కొడాలి నాని పరామర్శించారు. ఈ సందర్భంగా భారతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ భారతమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భారతమ్మ ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు.

Comments