ఆడబిడ్డలను సొంతకాళ్ళపై నిలబెట్టాలన్నదే నా ధ్యేయం.



*ఆడబిడ్డలను సొంతకాళ్ళపై నిలబెట్టాలన్నదే నా ధ్యేయం*



*నేనెప్పుడూ మహిళల పక్షపాతినే*


*నాకు  కూతుర్లు లేరు...మీరే నా ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు*


*పెద్దకొడుకలా ప్రతి కుటుంబానికి సేవ చేస్తా*


*జగన్ పాలనలో పంచదార కూడా చేదయ్యింది*


*మహాశక్తితో మహిళల జీవితాల్లో వెలుగులు* 


*జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధికమిస్తాం*


*శ్రీకాకుళం మహిళా సదస్సులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*


శ్రీకాకుళం (ప్రజా అమరావతి):- తనకు సొంత ఆడబిడ్డలు లేరని రాష్ట్రంలోని మహిళలే తన ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ఆడబిడ్డను సొంతకాళ్లపై నిలబెట్టాలన్నదే తన ధ్యేయమన్నారు. ఎప్పుడూ మహిళల పక్షపాతిగానే ఉంటానని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో బుధవారం నిర్వహించిన మహిళా సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.... ‘‘ధర్మాన ప్రసాదరావు పేరులోనే అధర్మం ఉంది. ఇచ్చిన మాట మీద నిలబడని వ్యక్తి. టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ను గెలిపించాలి. ఇక్కడున్న ఆడబిడ్డలను చూస్తుంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 

*మీ సాధికారతే నా ధ్యేయం*

నేనెప్పుడూ కూడా మహిళా పక్షపాతినే. టీడీపీ మీ అందరికీ పుట్టినిల్లు. ఏ కష్టమొచ్చినా మాకు చెప్పుకునే స్వేచ్ఛ మీకు ఉంది. మీ సంక్షేమం, అభివృద్ధి, మీ సాధికారతే నా ధ్యేయం. ఆడబిడ్డలకు చదువు, ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించింది టీడీపీనే. ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలు చేసుకునేలా చేశాం.  మహిళల కోసం ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు సొంత కాళ్లమీద నిలబడేలా చేశాం.  రూపాయి మీరు పొదుపు చేస్తే దానికి రివాల్యూం ఫండ్ ఇచ్చాను. పసుపు-కుంకుం డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలతో పాటు మీరు తయారు చేసిన వస్తువులను విక్రయించడానికి డ్వాక్రా బజార్లు పెట్టాం. 

*జగన్ పాలనలో ఆదాయం కంటే ఖర్చులు...అప్పులే ఎక్కువ*

ఆడబిడ్డలు ఆదాయాన్ని పెంచుకునే విధంగా చేశాం. ఐదేళ్లుగా ఆడబిడ్డలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అందుకే మీకు  అండగా నేనున్నానని భరోసా ఇవ్వడానికి ఈరోజు  మీ పెద్ద కొడుకుగా ఇక్కడికి వచ్చాను. ఐదేళ్లుగా మీ జీవితాలు తలకిందులయ్యాయి. జగన్ చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేకుండా పోయింది. నా ఆడబిడ్డల జీవితాలతో చెలగాటమాడిన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. ఈ ప్రభుత్వంలో ఆదాయం కంటే ఖర్చులు, అప్పులే ఎక్కువ పెరిగాయి. దానికి కారణం ఒక అసమర్థుడి పరిపాలన. జగన్ పాలనలో నిత్యం మోసాలు, అరాచకాలతో రాష్ట్ర నిండిపోయింది.

*ఇళ్లు తాకట్టు పెట్టే పరిస్థితి రాకూడదు*

 టీడీపీ హయాంలో మహిళల పేరుమీద ఇళ్లు కట్టించి ఇచ్చాం. తాగుడుకు బానిసై ఇళ్లు తాకట్టు పెట్టే పరిస్థితి రాకుండా ఉండాలని మీ పేరుపై కట్టించాం. మహిళల్లో అక్ష్యరాస్యత పెంచాం. బిడ్డలను చదివించి మంచి ఉద్యోగాలలో స్థిరపడేలా చేశారంటే దానికి తెలుగుదేశం పార్టీ. ఉన్నత స్థితిలో ఉన్న మహిళలను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. ఓటుకు ఇంకా 18 రోజులే ఉంది...మీరు వేసే ఓటుతో జగన్ రెడ్డిని బంగాళఖాతంలో కలపాలి. ఒక్కప్పుడు బియ్యం కేజీ రూ.40 ఉంటే ఇప్పుడు రూ.60కి పెరిగింది. కందిపప్పు గతంలో రూ.87 ఉంటే ఇప్పుడు రూ.160, చింతపండు రూ.122 ఇప్పుడు రూ.240కి పెంచారు. వంటనూనే రూ.60 ఇప్పుడు రూ.120, పంచదార కూడా ఈ ప్రభుత్వంలో చేదైపోయింది. గ్యాస్ సిలిండర్ గతంలో రూ.726 ఇప్పుడు రూ.1175 కు పెరిగింది. రూ.200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 వస్తోంది. చెప్పుకుంటూ పోతే అన్నింటి మీద రెట్టింపు భారం పడింది. 

*మద్య నిషేధం చేస్తానని రేట్లు పెంచారు*

సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచాడు. ఒకప్పుడు క్వార్టర్ రూ.60 ఉంటే ఇప్పుడు రూ.200 చేశారు. నాశిరక మద్యం వల్ల లివర్లు పాడవుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ తో రాష్ట్రం సర్వనాశనమైంది. ఒక్కసారి గంజాయికి అలవాటయితే మీ బిడ్డలు మీ చేతల్లో ఉండరు.   నిత్యావసర సరుకులు కావాలంటే కరెంటుతోనే పని అందుకే కరెంటు ఛార్జీలు పెంచి వాటి బిల్లు కూడా మీ మీద వేస్తారు. అమ్మఒడి ఇస్తున్నానని చెప్తున్నాడు మొదటి సంవత్సరం రూ.15 వేలు అని చెప్పాడు తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఇప్పుడు రూ.13 వేలకు కుదించారు. టీడీపీ ప్రభుత్వంలో తల్లికివందనం ద్వారా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇచ్చే బాధ్యత నాది. జగన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి రూ.100 దోచేస్తున్నారు. అందుకే పేదవారు ఇంకా నిరుపేదలవుతున్నారు.

*మహాశక్తితో మహిళల జీవితాల్లో వెలుగులు* 

 ‘మహాశక్తి’ పథకాల ద్వారా మహిళల కోసం నాలుగు కార్యక్రమాలు తీసుకొచ్చా.  ప్రతి మహిళకు నెలకి రూ.1500, ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి రూ.15000, ‘దీపం’ పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తాం. తాగడానికి నీళ్లు లేక కలుషితమైన నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం కల్పించి సురక్షితమైన మంచినీళ్లు ఇస్తాం.  డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం.  జగన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ నొక్కి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశాడు. 

*2 సెంట్లలో ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది*

సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ల కోసం ఖర్చు పెట్టాలి.

 సెంటు పట్టాలను రద్దు చేయ్యను...వాటినీ పూర్తి చేస్తాం. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించి ఇచ్చే బాద్యత నాది. గతంలో మన ప్రభుత్వంలో పేదవారి కోసం టిడ్కో ఇళ్లు నిర్మించాను.  జగన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను కట్టించిన ఇళ్లకు రంగులేసుకున్నాడే తప్ప మీకు ఇవ్వలేదు.  డబ్బులు కట్టిన వాళ్లకు టిడ్కో ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. 

*వృద్ధులకు రూ.4 వేలు...దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్*

వైసీపీ ప్రభుత్వం పెన్షన్లతో శవరాజకీయాలు చేస్తోంది. పెన్షన్ రూ.200 నుంచి రూ.2,000కు పెంచి సంక్షేమానికి టీడీపీ నాంది పలికింది. మన ప్రభుత్వం వచ్చాక ప్రతి నెలా 1వ తేదీన ఇంటి వద్దకే వచ్చి రూ.4000 లు పెన్షన్ ఇస్తాం.  ఏప్రిల్,మే, జూన్ నెలలవి కూడా కలిపి పెంచిన పింఛను జూలైలో ఇస్తా. దివ్యాంగులకు రూ.6000 ఇస్తాం.  గౌరవ వేతనాన్ని వాలంటీర్లకు రూ.10 వేలకు పెంచుతాం.  నరేగా పనుల్లో కూడా స్కామ్ జరుగుతోంది. పేదవాళ్లు జీవనోపాధి కోసం నరేగ పనులు చేసుకుంటారు.  ఎండాకాలంలో మామూలు సమయం కంటే 40 శాతం కూలీని మా హయాంలో పెంచాం.  నరేగాలో మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చి పేదవారికి అండగా ఉంటాం. 

*శ్రీకాకుళం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు*

మత్య్సకారుల కోసం మినీ జెట్టీలు ఏర్పాటు చేస్తా. ఇక్కడ స్టేడియం కట్టిస్తా. పాలకొండ రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తాం. శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు సమస్యను పరిష్కరిస్తాం. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. రాష్ట్రంలోనే తలసరి ఆదాయం తక్కువ వచ్చే జిల్లా..ఎక్కువ వలసలు వెళ్లే జిల్లా ఇది. యుద్ధానికి మేము సైతం సిద్ధమని ప్రాణాలు సైతం త్యాగం చేసే ఘనత శ్రీకాకుళం ప్రజలది. శ్రీకాకుళం జిల్లా అంటే త్యాగాలకు గడ్డ. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, ప్రాంతాలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది.  ఈ రోజు ఈ కూటమి పార్టీలది కూడా ఒకటే నిర్ణయం రాష్ట్రాన్ని బాగు చేయాలి. అభివృద్ధి చేసి నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.  యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మెగాడిఎస్సీ పైనే తొలి సంతకం పెడతా. 


Comments