సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై జిల్లా కలెక్టర్ చర్యలు*
*: కదిరి తహసీల్దార్ మారుతిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ*
అనంతపురం, డిసెంబర్ 04 (ప్రజా అమరావతి):
*కదిరి తహసీల్దార్ మారుతిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. పాస్ పుస్తకం మంజూరు కోసం కదిరి తహసీల్దార్ లంచం అడిగారన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. సత్వరమే మారుతి కదిరి తహసీల్దార్ గా రిలీవ్ అయి.. తాత్కాలికంగా కలెక్టరేట్లో రిపోర్ట్ చేసుకోవాలని నిర్దేశించారు. లంచం అడిగారన్న విషయమై సమగ్ర విచారణ చేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ ఆసరా గంగాధర్ గౌడ విచారణ చేయించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కదిరి ఇన్చార్జి తాసిల్దార్ గా కదిరి డిప్యూటీ తాసిల్దార్ గా నియామకము ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ జారీ చేశారు.
addComments
Post a Comment