జగనన్నశాశ్వత భూహక్కు మరియు భూరక్ష పై మంత్రుల కమిటీ సమావేశం




- సచివాలయంలో జగనన్నశాశ్వత భూహక్కు మరియు భూరక్ష పై మంత్రుల కమిటీ సమావేశం

- సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ధర్మాన కృష్ణదాస్, శ్రీ బొత్స సత్యనారాయణ,  ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ అజేయకల్లాం.



అమరావతి (ప్రజా అమరావతి):


సచివాలయం మూడో బ్లాక్‌లోని మీటింగ్ హాల్‌లో మంగళవారం ''జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం''పై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. పథకం అమలుపై మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ధర్మాన కృష్ణదాస్, శ్రీ బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ అజేయకల్లాం లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్, సర్వే, స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్, గనుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా అధికారులు పథకం అమలు, ప్రగతిపై మంత్రుల కమిటీకి వివరించారు. గ్రామాల్లో గతంలో ఉన్న గ్రామకంఠం భూముల్లో క్రమంగా నివాసాలు రావడం, సదరు భూమి నిర్మాణాలతో వినియోగంలోకి రావడం వల్ల కొత్తగా నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేల్లో దీని విస్తీర్ణం పెరుగుతోందని వివరించిన అధికారులు. రికార్డుల ప్రకారం గ్రామకంఠంలోని భూముల్లో నివాసాలకు ఉన్న చట్టబద్దతను గుర్తించడం, వాటికి హక్కు పత్రాలను అందించే క్రమంలో ఎదురవుతున్న అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపిన అధికారులు. ఈ నేపథ్యంలో గ్రామకంఠం కోసం కూడా వెబ్‌ ల్యాండ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రులకు తెలిపిన అధికారులు.  జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద మొదటి దశలో 5 వేలగ్రామాల్లో సర్వే పూర్తి చేసి, హక్కుపత్రాలను జారీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు. 2022 జూన్ నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.    ఇప్పటి వరకు 1096 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయ్యిందని, వీటిల్లో 594 గ్రామాల్లో డ్రోన్‌ మ్యాప్‌లను తీసుకోవడం జరిగిందన్నారు.  433 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యిందని, మరో 86 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ కొనసాగుతోందని వివరించిన అధికారులు. ఇప్పటి వరకు దాదాపు 83.43 శాతం గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. 138 గ్రామాల్లో గ్రౌండ్ వాలిటేషన్ కోసం మ్యాప్‌లను స్వీకరణ పూర్తయ్యిందని, వాటిల్లో 115 గ్రామాల్లో గ్రౌండ్ వాలిడేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపిన అధికారులు. మిగిలిన 23 గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపిన అధికారులు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో భూసర్వే, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా ఒక పారదర్శక విధానంను అమలులోకి తీసుకురావాలని సీఎం శ్రీ వైయస్ జగన్ ఈ పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. నిర్ధిష్ట సమయంలోనే సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా భూములకు శాశ్వతంగా భూహక్కు కల్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 


*అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి: మంత్రులు*

రాష్ట్ర వ్యాప్తంగా వేలాధి ఎకరాల్లో వెలిసిన అక్రమ లేఅవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణలు డిటిసిపి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 80వేల ఎకరాల్లో 14వేల అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించడంతో తక్షణం వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా లేఅవుట్లను సిద్దం చేస్తున్నారని, వాటిపై నియంత్రణలో అధికారులు దృష్టి సారించాలని అన్నారు. అనుమతి ఉన్న లేవుట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఖచ్చితంగా ప్రతి లే అవుట్ డిటిసిపి అనుమతి పొందేలా చూడాలని అన్నారు. 


ఈ సమావేశంకు హాజరైన సిసిఎల్‌ఎ నీరబ్ కుమార్ ప్రసాద్,  పిఆర్‌&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్థ్‌జైన్, డిఎంజి విజి వెంకటరెడ్డి తదితరులు.

Comments