అమరావతి (ప్రజా అమరావతి);
*నేడే (21.12.2021, మంగళవారం) జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం*
*పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయనున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్*
*జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఇప్పటికే లబ్దిపొందిన వారికి నేటి నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయడం జరుగుతుంది*
*గతంలో ఉన్న నివసించే హక్కు స్ధానంలో, దాదాపు 52 లక్షల మందికి సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్*
*ఈ పథకం క్రింద దాదాపు రూ. 10,000 కోట్ల రుణమాఫీతో పాటు రూ. 6,000 కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపుతో దాదాపు రూ. 16,000 కోట్ల లబ్ది*
*ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందం*
*దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పేదలకు ప్రభుత్వాలు కేవలం నివసించే హక్కులు మాత్రమే ఇస్తున్న పరిస్ధితుల్ని మారుస్తూ...ఈ రోజు మీ ఇంటి విలువ రూ. 2 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు ఉన్నప్పటికీ మీ ఇల్లు మరియు మీ ఇంటి స్ధలాన్ని మీకు అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేక ఆ ఆస్తి మీద సర్వహక్కులు పొందలేని దుస్ధితిని తొలగిస్తూ...కేవలం నామమాత్రపు రుసుముతో శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం మీ రుణాలు, మీ వడ్డీలు అన్నీ మాఫీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేయిస్తూ మీ ఇంటిపై మీకు పూర్తి హక్కులు ఇస్తున్న శుభవేళ ఇది*.
*గత ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య ఐదేళ్ళలో అధికారులు 5 సార్లు వడ్డీ మాఫీ ప్రతిపాదనలు పంపినా ఏదో ఒక నెపంతో తిప్పిపంపి, రుణం సంగతి దేవుడెరుగు, వడ్డీ కూడా మాఫీ చేయలేదు. అయితే 43 వేల మంది లబ్ధిదారులు వారి అసలు,వడ్డీ కలిపి రూ. 15.29 కోట్లు చెల్లించినప్పటికీ ఎలాంటి యాజమాన్య హక్కులు పొందలేదు. వారికి కూడా నేడు ఉచితంగా సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం*.
*జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా అందే ప్రయోజనాలు*
*1. ఇంటిపై సర్వ హక్కులు*
గతంలో ఉన్న కేవలం నివసించే హక్కు స్ధానంలో నేడు లబ్దిదారునికి తన ఇంటిపై సర్వ హక్కులు కల్పించబడతాయి
*2. లావాదేవీలు సులభతరం*
ఇంటిపై పూర్తి హక్కును పొందడం ద్వారా లబ్దిదారుడు సదరు ఇంటిని అమ్ముకోవచ్చు. బహుమతిగా ఇవ్వవచ్చు, వారసత్వంగా అందించవచ్చు. కుటుంబ ఆర్ధిక అవసరాలకు అవసరమైతే తనఖా పెట్టుకుని బ్యాంకుల నుండి రుణం కూడా పొందవచ్చు
*3. రూ. 16 వేల కోట్ల లబ్ధి*
దాదాపు 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ. 10 వేల కోట్ల రుణమాఫీ, మరో రూ. 6 వేల కోట్ల మేర స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుతో మొత్తం రూ. 16,000 కోట్ల లబ్ది
*4. నామమాత్రపు రుసుము*
15 ఆగష్టు 2011 వరకు గృహ నిర్మాణ సంస్ధ వద్ద స్ధలాలను తనఖా పెట్టి, ఇళ్ళ నిర్మాణాలకు రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు,వడ్డీ కలిపి దాదాపు రూ. 10 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం. అసలు,వడ్డీ ఎంత ఎక్కువ ఉన్నా కేవలం గ్రామాలలో రూ. 10 వేలు, మున్సిపాలిటీలలో రూ. 15 వేలు, కార్పొరేషన్లలో రూ. 20 వేలు చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తం మాఫీ...చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తంపై రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తూ పూర్తి హక్కులు
*5. ఇంటిపై సర్వహక్కులు*
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఇంటి మీద పూర్తి హక్కులు లేని దాదాపు 12 లక్షల మందికి కేవలం రూ. 10కే సర్వహక్కులతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్న ప్రభుత్వం ఇది.
*6. 22 (ఏ) నుండి తొలగింపు*
లబ్దిదారుడి స్ధిరాస్తిని గతంలో ఉన్న నిషేదిత భూముల జాబితా (22 ఏ నిబంధన) నుండి తొలగింపు. దీనివల్ల లబ్దిదారుడు తన ఇంటిపై ఎలాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు
*7. రిజిస్ట్రేషన్ ఇక సులభతరం*
లబ్ధిదారుడికి చెందిన స్ధిరాస్తిని గ్రామ–వార్డు సచివాలయంలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు. రిజిస్ట్రేషన్ కోసం సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో పడిగాపులు పడవల్సిన అవసరం కూడా లేదు.
*8. లింకు డాక్యుమెంట్లతో పనిలేదు*
ఈ పథకం క్రింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయములకు ఏ విధమైన లింకు డాక్యుమెంట్లు కూడా అవసరరం లేదు.
addComments
Post a Comment